Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కేంద్ర విజిలెన్స్ కమిషన్ మేరకు ''విజిలెంట్ ఇండియా, ప్రాస్పెరస్ ఇండియా'' అనే అంశంపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ బ్యాంక్ తెలిపింది. యువత, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలకు, ఆన్లైన్ ఛానెల్ ద్వారా అవగాహన కల్పించడానికి బ్యాంక్ వివిధ కార్యక్రమాలు, వెబ్నార్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. యూబీఐ శాఖలు, కార్యాలయాలలో దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా తొలుత ముంబయిలోని తమ సెంట్రల్ కార్యాలయంలో ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రారు జి లాంచనంగా ప్రారంభించారు.