Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ఫోన్ కంపెనీ టెక్నో భారత మార్కెట్లోకి ప్రవేశించిన మూడేళ్ల కాలంలో 60 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుత పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 30 వరకు గ్రేట్ టక్నో ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ క్యాంపెయిన్లో తమ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారు కార్లు, బైకులు, కెమెరాలు, స్మార్ట్ఫోన్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.