Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిఎండబ్ల్యు ఎక్స్3ఎం ఆవిష్కరణ
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు బిఎండబ్ల్యు భారత మార్కె ట్లోకి బిఎండబ్ల్యు ఎక్స్3 ఎంను విడుదల చేసింది. పెట్రోల్ ఇంజిన్తో లభించే దీని ఎక్స్షోరూం ధరను రూ.99.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారు 4.2 సెకంన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోనుంది. ఈ మిడ్సైజ్ స్పోర్ట్స్ వెహికల్ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 3.0 లీటర్ల సామర్థ్యం, 6 సిలిండర్, టర్బో టెక్నలాజీతో దీన్ని తయారు చేసింది. 480 హెచ్పి పవర్, 600 ఎన్ఎం టార్క్తో దీన్ని విడుదల చేసింది.