Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత ప్రీమియం కార్లలో తయారీదారుల్లో ఒక్కటైన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) సోమవారం భారత మార్కెట్లోకి హోండా అమేజ్, ప్రీమియం స్పోర్టీ లైఫ్ స్టైల్ వెహికల్ హోండా డబ్ల్యుఆర్-వి ప్రత్యేక ఎడిషన్లను విడదల చేసింది. ఈ ప్రత్యేక వాహనాలు అన్ని రంగుల్లోనూ లభ్యమవుతాయని హెచ్సిఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత పండగ సీజన్లో అభిమాన కొనుగోలుదారులను ఆకట్టుకునేలా విలక్షణమైన ప్రీమియం ప్యాకేజీతో వీటిని ఆవిష్కరించామన్నారు. పెట్రోల్ ఎడిషన్లో ఎంటి మోడల్ ధరను రూ.7.96 లక్షలుగా, సివిటి ధరను రూ.8.79 లక్షలుగా నిర్ణయించగా.. డీజిల్ వర్షన్లో ఎంటి ధరను రూ.9.26 లక్షలుగా, సివిటి ధరను రూ.9.99 లక్షలుగా ప్రకటించింది.