Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశ ఆర్థిక కార్యకలాపాల సూచీకలో కీలకమైన స్టీల్ వినిమయం భారీగా పడిపోనుందని బ్రిక్వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాదిలో స్టీల్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో ఏకంగా 10-12 శాతం పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకున్న లాక్డౌన్ నిబంధనలు ఈ లోహం వినిమయాన్ని పడేశాయని పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వాహన పరిశ్రమ నుంచి స్టీల్ ఉత్పత్తులకు కొంత డిమాండ్ పెరిగిందని తెలిపింది. మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగడం ద్వారా స్టీల్ డిమాండ్లో రికవరీ ఉందని వెల్లడించింది. ప్రస్తుత ఏడాది నవంబర్ మాసం 26 నాటికి పెట్రోల్ వినియమంలో 4.5 శాతం పెరుగుదల చోటు చేసుకోగా.. డీజిల్ వినియోగంలో 7.3 శాతం పతనం చోటు చేసుకున్నట్లు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలిసిస్ సెల్ తెలిపింది.