Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా రాకేశ్ శర్మ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సీఈఓగా బాధ్యతలు స్వీకరించక ముందు ఆయన 'లక్ష్మీ విలాస్ బ్యాంకు' ఎండి, సీఈఓగా కూడా పని చేశారు. 2014 మార్చి నుంచి ఆయన ఈ ప్రయివేటు బ్యాంకుకు హెడ్గా సేవలందిస్తున్నారు. 33 ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ ప్రభుత్వ రంగ బ్యాంకులోనే కేరీర్ను ప్రారంభించి సీజీఎం స్థాయి వరకు పదోన్నతి పొందారు. అనంతరం లక్ష్మీ విలాస్ బ్యాంకుకు వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త అధినేతనలు ఎంపిక చేయగా అందులో రెండు బ్యాంకులకు ప్రయివేటు వారిని ఎంపిక చేసింది. కెనరా బ్యాంకునకు రాకేశ్శర్మ పాటు, బ్యాంకు ఆఫ్ బరోడాకు జయకుమార్ను సీఈఓగా ఎంపిక చేశారు.