Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బికె బిర్లాకు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ కేసోరామ్ ఇండిస్టీస్ను జెకె గ్రూపు స్వాధీనం చేసుకోనుంది. రూ.2,200 కోట్లతో హరిద్వార్లోని కేశోరామ్ యూనిట్ను కొనుగోలు చేస్తున్నట్లు జెకె టైర్ ప్రకటించింది. కేేశోరామ్ ఇండిస్టీస్ లిమిటెడ్ (సిఐఎల్)లోని 100 శాతం ఈక్విటీని కొనుగోలు చేయడానికి జెకె ఆసియా పసిఫిక్ సింగపూర్ పిటిఇ లిమిటెడ్ అనుబంధ సంస్థ జెకె టైర్ సంతకాలు చేసుకున్నాయి. జెకె టైర్స్ ప్రపంచ వ్యాప్తంగా 9 ప్లాంట్లతో ట్రక్కులు, బస్సులు, ప్యాసింజర్ కార్లు, ఇతర వాహనాల టైర్లు, ట్యూబుల తయారీ యూనిట్లను కలిగి ఉంది.