Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అత్యంత శుభప్రదమైన సంక్రాంతి సంబరాలను వేడుక చేయడంలో భాగంగా, భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే స్మార్ట్ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను వెల్లడించింది. ఈ ఉత్సాహపూరితమైన ఆఫర్లతో పాటుగా లక్కీ డ్రా మరియు ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలు సైతం జనవరి 11,2021 వ తేదీ నుంచి జనవరి 26,2021వ తేదీ వరకూ లభ్యమవుతాయి.
ఈ ఆహ్లాదకరమైన సందర్భానికి మరింత ఆనందాన్ని జోడిస్తూ, ఈ ఆఫర్లలో భాగంగా గెలాక్సీ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై లక్కీ డ్రా సైతం అందిస్తున్నారు. ఈ లక్కీ డ్రా ఆఫర్ జనవరి 11,2021 వ తేదీ నుంచి జనవరి 26,2021వ తేదీ వరకూ లభ్యమవుతుంది. ఈ పదహారు రోజుల కాలంలో, గెలాక్సీ స్మార్ట్ఫోన్ను కొనుగోలుచేసిన వినియోగదారులకు 58 అంగుళాల క్యుఎల్ఈడీ టీవీను బంపర్ బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. దీనితో పాటుగా ప్రతి వారం 32 అంగుళాల ఎల్ఈడీ టీవీలను సైతం లక్కీ డ్రాలో గెలుపొందవచ్చు. లక్కీ డ్రా ఆఫర్తో పాటుగా, మొదటి 2500 మంది వినియోగదారులకు మొదట వచ్చిన వారికి మొదట అనే పద్ధతిలో ఆఫర్ అందిస్తారు. ఈ పదహారు రోజుల పరిమిత కాలపు ఆఫర్లో గెలాక్సీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు సుప్రసద్ధ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అహాఉ ఒక సంవత్సర చందాను పొందేందుకు అర్హులవుతారు. ఈ లక్కీ డ్రా ఆఫర్ 9500 రూపాయలకు పైన విలువ కలిగిన అన్ని శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై వర్తిస్తుంది.
అదనంగా, వినియోగదారులు సుప్రసిద్ధ బ్యాంకు కార్డులను పూర్తిగా స్వైప్ చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ను సైతం పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 11,2021 నుంచి జనవరి 20,2021వ తేదీ వరకూ గెలాక్సీ ఏ21ఎస్, గెలాక్సీ ఏ 31, గెలాక్సీ ఏ 51, గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఎం11, గెలాక్సీ ఎం 21, గెలాక్సీ ఎం 31,గెలాక్సీ ఎం 31ఎస్ మరియు గెలాక్సీ ఎం51 కొనుగోలుపై వర్తిస్తుంది.