Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్కు ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్స్ అవార్డ్సు 2020లో మొదటి, రెండవ అవార్డులు దక్కినట్టు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి, విశాఖపట్నంలోని భయ్యవరం, బెంగళూరు ప్రాసెసింగ్ యూనిట్లకు క్రియాశీలక ఎనర్జీ వినియోగంలో ఇంధన పొదుపు, అధిక ఉత్పత్తిలో అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఈ అవార్డులను హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరీ, ఆపరేషన్స్ హెడ్ డివిఆర్కె ప్రసాద్లకు విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కె సింగ్ అందజేశారని తెలిపింది.