Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: భారతదేశ వ్యాప్తంగా తాను నిర్వహిస్తున్న 10 బిజినెస్ పార్కుల్లో కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా సమర్థవంతమైన భద్రత చర్యలను జారీ చేస్తున్న నేపథ్యంలో బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ప్రకటించిన గ్లోబల్ బెంచ్మార్కింగ్ ధ్రువీకరణను క్యాపిటాల్యాండ్ అందుకుంది. ఆరోగ్యం, భద్రత మరియు పర్యావరణ నిర్వహణలో 60 ఏళ్ల నైపుణ్యంతో నెలకొల్పిన బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నిర్దేశించిన కఠినమైన ప్రపంచ భద్రతా ప్రమాణాలను అన్నింటినీ పరిశీలించి, సమగ్ర అంచనా అనంతరం ఈ సర్టిఫికేషన్ను జారీ చేశారు. భారత ప్రభుత్వం మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక వివరణాత్మక కొవిడ్-19 ఫ్రేమ్వర్కును కౌన్సిల్ అభివృద్ధి చేసింది.
క్యాపిటాల్యాండ్ ఇండియా బిజినెస్ పార్కుల సీఈఓ వినమ్రా శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘మా పార్కుల సమగ్ర ఆడిట్ అనంతరం అందుకున్న ఈ సర్టిఫికేషన్, భారతదేశంలో క్యాపిటాల్యాండ్కు ఉన్న బిజినెస్ పార్కుల్లో బలమైన ఆరోగ్య మరియు భద్రతా చర్యలను మరింత ధ్రువీకరిస్తుంది. మా బిజినెస్ పార్కుల్లో బాడుగదారులు తమ కార్యాలయాల నుంచి పని చేసేందుకు తిరిగి వచ్చినప్పుడు, విధులకు హాజరయ్యేందుకు అన్ని ప్రోటోకాల్స్ను అనుసరిచేందుకు, అధిక పరిశుభ్రత ప్రమాణాలను పాటించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. వారు ప్రతిసారీ మాపై ఉంచిన నమ్మకాన్ని సమర్ధిస్తున్నాము. మా బాడుగదారులు మరియు వారి ఉద్యోగుల శ్రేయస్సును నిర్ధారించేందుకు మా బిజినెస్ పార్కుల్లో మేము కాంటాక్ట్లెస్ సొల్యూషన్స్ మరియు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనసాగిస్తున్నామని’’ వివరించారు.
బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ సీఈఓ మైక్ రాబిన్సన్ మాట్లాడుతూ ‘‘లాక్డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం ఎక్కువ మంది ఉద్యోగులు తిరిగి విధులకు హాజరవుతున్న నేపథ్యంలో సిబ్బంది మరియు యజమానులు కార్యాలయాలను సురక్షితంగా ఉంచేందుకు సాధ్యమైన వరకు సురక్షిత చర్యలు తీసుకుంటున్నామనే విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్మెంట్ సర్టిఫికేషన్తో, క్యాపిటాల్యాండ్ భద్రతా నిబంధనలు, అనుబంధ నియంత్రణ ఏర్పాట్లు ప్రస్తుత ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని నిరూపించగా, వాటి ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు కొనసాగనున్నాయని’’ తెలిపారు.
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, క్యాపిటాల్యాండ్ తన టెనెంట్లు మరియు ఉద్యోగులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు, తన బిజినెస్ పార్కులను శుభ్రపరిచేందుకు పలు రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. భద్రతా చర్యలలో ఫుట్-పెడల్ ఆపరేటెడ్ సిస్టమ్తో కాంటాక్ట్లెస్ లిఫ్ట్ యాక్టివేషన్, మెరుగైన ఇండోర్ వాయు నాణ్యతకు అతి నీలలోహిత జెర్మిసైడ్ ఇర్రేడియేషన్, ఉష్ణోగ్రత పరీక్షకు థర్మల్ స్కానర్లు, శారీర స్పర్శను తగ్గించేందుకు అనువర్తన-ఆధారిత సందర్శకుల నిర్వహణ వ్యవస్థ, ఉపరితలాలకు యాంటీ మైక్రోబియల్ పూత, అల్ట్రా-లో ఫాగింగ్ మరియు క్రిమిసంహారక, కామన్ ఏరియాల్లో హ్యాండ్స్-ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్లు, వ్యాధికారక వ్యాప్తిని తగ్గించేందుకు పరిశుభ్రత ప్రోటోకాల్లు, ఐసోలేషన్ గదులు, చక్కగా శుభ్రం చేసేందుకు అంకితభావం కలిగిన సిబ్బంది బృందం, క్యూఆర్ కోడ్ ఆధారిత ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ మరియు సహాయక సిబ్బంది మొత్తానికి ప్రత్యేక శిక్షణ ఇందులో ఉన్నాయి. క్యాపిటాల్యాండ్ టెనెంట్లు మరియు వారి ఉద్యోగుల కోసం కార్యాలయ గైడ్ బుక్ను అభివృద్ధి చేసి, తిరిగి అందుబాటులోకి తీసుకురాగా, ప్రోటోకాల్లు మరియు దాని బిజినెస్ పార్కుల్లో కొవిడ్-19 వ్యాప్తి ప్రమాదాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏర్పాట్లను ఇది వివరిస్తుంది. భారతదేశంలో, క్యాపిటాల్యాండ్కు ప్రస్తుతం బెంగుళూరు, చెన్నై, గుర్గావ్, హైదరాబాద్, ముంబై మరియు పుణెల్లో వ్యాపార మరియు ఐటి పార్కులు, పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ ఆస్తులతో కూడిన 17.9 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని కలిగి ఉంది.