Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA) | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)

Wed 13 Jan 16:45:43.115997 2021

·       ప్రతిపాదిత బిల్లు కారణంగా భారతదేశంలో అక్రమ సిగిరెట్‌ వాణిజ్యం  పెరుగుతుంది మరియు దేశీయంగా వృద్ధి చేసే పొగాకుకు డిమాండ్‌పై తీవ్రప్రభావం పడటంతో పాటుగా భారతీయ రైతుల సంపాదనపై కూడా అది తీవ్ర ప్రభావం చూపనుంది
·       అక్రమ మరియు స్మగుల్డ్‌  సిగిరెట్లు పెరగడం వల్ల భారతీయ ఎఫ్‌సీవీ టొబాకో సాగుదారులకు 1300కు పైగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.
·       అంతర్జాతీయ ఎన్‌జీవోల ప్రభావం బారిన పడవద్దని అభ్యర్థన.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో వాణిజ్య పంటలను సాగు చేస్తోన్న లక్షలాది మంది రైతులు మరియు రైతు శ్రామికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తోన్న లాభాపేక్ష లేని సంస్ధ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) నేడు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి కోట్పా సవరణ చట్టంను ఉపసంహరించుకోవాల్సిందిగా అభ్యర్ధించింది. భారతీయ ఎఫ్‌సీవీ పొగాకు రైతుల కోసం కోట్పా మరణ శాసనంగా మారనుంది. ప్రతిపాదిత సవరణ బిల్లు 2020 తో భారతదేశంలో సిగిరెట్ల అక్రమ రవాణాకు భారీ తోడ్పాటు లభించనుంది. ఈ ఫలితంగా, భారతీయ రైతులు సాగు చేసే పొగాకుకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. ఫైఫా ఇప్పటికే తమ అభ్యర్ధనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు అయినటువంటి పీఎంఓ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలు, కార్మిక మంత్రిత్వ శాఖలకు సమర్పించింది.
         గత కొద్ది సంవత్సరాలుగా, పొగాకుపై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. హెచ్చరికల బొమ్మల పరిమాణం పెంచడం, సిగిరెట్లపై భారీస్ధాయిలో పన్నులు విధించడం వంటివి ఉన్నాయి. 2012–13తో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా పన్ను వేయడంతో పాటుగా ఎగుమతుల ప్రమోజనాలను సైతం ఉపసంహరించారు. ఇవన్నీ కూడా రైతుల జీవనోపాధిని దెబ్బతీసేటటువంటివే ! మరీ ముఖ్యంగా పొడి, సారవంతం కాని నేలల్లో పొగాకు తరహాలో రాబడులు అందించే ప్రత్యామ్నాయ పంటలనేవీ చూపి రైతులకు సహాయపడలేదు.
         ప్రస్తుతం, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాల్గవ అతిపెద్ద అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌గా ఇండియా నిలుస్తుంది. గత దశాబ్దంన్నరలో అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌ ఇక్కడ రెట్టింపయింది. దీనికారణంగా ఎఫ్‌సీవీ వ్యవసాయ సమాజం 6వేల కోట్ల రూపాయలను గత ఏడేళ్లలో నష్టపోయింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా శ్రీ జవారీ గౌడ, అధ్యక్షులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘ప్రతిపాదిత బిల్లులోని సవరణలు వాణిజ్యవేత్తలు, వ్యాపారులను భయబ్రాంతులను చేసే రీతిలో ఉన్నాయి. సిగిరెట్ల విక్రయవ్యాపారం చేసేందుకు వారు భయపడవచ్చు. ఈ కారణం చేత, నేరపూరిత స్వభావం కలిగిన సిండికేట్లు అక్రమ సిగిరెట్‌ రవాణా కు పాల్పడటంతో భారతీయ అక్రమ సిగిరెట్లమార్కెట్‌లో వాటి వరదను కొనసాగించవచ్చు. ఈ తరహా అక్రమ సిగిరెట్ల నాణ్యత హీనంగా ఉండటంతోపాటుగా భారతీయ చట్టాలనేవీ ఇవి అనుసరించవు. అంతేకాదు, ప్రస్తుతం అక్రమా పొగాకు ఉత్పత్తి ప్యాకేజీలేవీ కూడా చట్టబద్ధమైన హెచ్చరికలను కలిగి ఉండవు. ఈ అక్రమ సిగిరెట్లలో దేశీయంగా సాగు చేసిన పొగాకు  వినియోగించకపోవడం వల్ల లక్షలాది మంది పొగాకు రైతుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి’’ అని అన్నారు. శ్రీ మురళి బాబు, జనరల్‌ సెక్రటరీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసొసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘సవరణ బిల్లులో ఎఫ్‌సీటీసీ యొక్క నిబంధనలన్నీ కూడా పూర్తి శక్తివంతం కావడంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఎఫ్‌సీటీసీ కోరుకున్న దాని కన్నా అధికంగా కోరుకుంటుంది. అయితే,  ప్రతిపాదిత కఠిన చట్టాల వల్ల సమస్యలు ఎదుర్కొనబోయే పొగాకు రైతలకు సంబంధించి ఇప్పటివరకూ వాస్తవ సమస్యలపై ఎలాంటి చర్చలు లేదా చర్యలూ తీసుకోలేదు. గౌరవనీయ ప్రధానమంత్రి దృష్టికి ఈ అంశాలను తీసుకురావడంతో పాటుగా ప్రతిపాదిత కఠిన చట్టాల వల్ల కలిగే ప్రభావాన్ని సైతం ఆయన దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
       ప్రపంచంలో అత్యధికంగా పొగాకు పండించే దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. దేశంలో పొగాకును 13 రాష్ట్రాలలో సాగు చేస్తుండటంతో పాటుగా 4.57 కోట్ల మంది దీనిపై ఆధారపడ్డారు. జీవనోపాధి కోసం పొగాకుపై ఇంత భారీ స్ధాయిలో ప్రజలు మరే దేశంలోనూ ఆధారపడి లేరు.
యశ్వంత్‌ చీడిపోతు, నేషనల్‌ స్సోక్స్‌పర్సన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసొసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘స్వార్థ ప్రయోజనాలను ఆశించి కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని  తప్పుదారి పట్టిస్తున్నాయని మేము నమ్ముతున్నాము. పొగాకు నియంత్రణ ఉద్యమకారులు మరియు ఎన్‌జీవోల వాస్తవ ఎజెండాపై ప్రభుత్వం తగిన పరిశోధన చేయాలి. ఈ సంస్థలే తప్పుడు ప్రచారం చేయడంతో పాటుగా పలు చోట్ల సమస్యలనూ సృష్టిస్తూ చట్టబద్ధమైన పొగాకు వ్యాపారం, ఉత్పత్తులకు అవరోధం కలిగిస్తున్నారు’’ అని అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల శ్రద్ధ వహించే విధాన నిర్ణేతలను, ప్రతిపాదిత సవరణలేవీ తీసుకురావద్దని ఎఫ్‌సీవీ ఫార్మింగ్‌ సమాజం అభ్యర్ధిస్తుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దలాల్‌ స్ట్రీట్‌ బేజారు
యూనియన్‌ బ్యాంక్‌ మరో మైలురాయి
శ్రీసిటీలో 'పానాసోనిక్‌' ప్లాంట్‌
మౌలిక వసతుల కోసం ప్రత్యేక బ్యాంక్‌..!
మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాం
పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా తయారి కేంద్రానికి భూమి పూజ
ఇండియాలో తయారైన స్కోడా కుషాక్
ప్రజలు కోరుకునే బడ్జెట్‌ కావాలి : కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ వెబినార్
బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.