Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· వ్యాపారాభివృద్ధి కోసం సహకార పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు ఈక్వెల్ పార్టనర్ పాలసీ ఆవిష్కరించడం ద్వారా తమ ఎస్సెట్ యజమానుల పట్ల నిబద్ధతను బలోపేతం చేయనుంది
· దీనికనుగుణంగా, ఓయో ఇప్పుడు తమ రెండవ ఎడిషన్ లాయల్టీ కార్యక్రమం క్లబ్ రెడ్ను భారతదేశంలోని ఎస్సెట్ యజమానుల కోసం ఆవిష్కరించడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయనుంది
· తమ యజమానులకు స్థిరంగా విలువను ఈ కంపెనీ అందించడం ద్వారా 2020లో అత్యున్నతంగా భాగస్వామ్య సంతృప్తి స్థాయిని చూసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఐదు రెట్ల వృద్ధి
విశాఖపట్నం: ప్రపంచంలో అతిపెద్ద ఆతిథ్య రంగ సంస్థ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తమ ఈక్విల్ పార్టనర్ పాలసీని తమ ఎస్సెట్ యజమానులతో జరిగిన వెబినార్లో ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ఫౌండర్, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ ; ఓయోఇండియా అండ్ దక్షిణాసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ ఆవిష్కరించారు. తమ ఎస్సెట్ ఓనర్ కమ్యూనిటీ నడుమ పారదర్శకతను వృద్ధి చేయడంతో పాటుగా నమ్మకాన్ని సైతం బలోపేతం చేసే కార్యక్రమం ఇది. ఈపీపీ కింద, ఓయో ఏడు మార్గదర్శకాలు – కమ్యూనికేషన్, గౌరవం, లభ్యత, పారదర్శకత, గుర్తింపు, సాంకేతికత, ఏకత్వం–పై ఆధారపడి సహకార పర్యావరణ వ్యవస్ధను తమ ఎస్సెట్ యజమానుల వ్యాపారాభివృద్ధి కోసం కంపెనీ సృష్టించనుంది.
ఈ మౌలిక సూత్రాలకనుగుణంగా గుర్తింపు కింద ఓయో ఇప్పుడు తమ రెండవ ఎడిషన్ క్లబ్ రెడ్ను సైతం ఆవిష్కరించింది. ఓయో ఇండియా అండ్ దక్షిణాసియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ మాట్లాడుతూ ‘‘మా ఎస్సెట్ యజమానులతో సన్నిహితంగా పనిచేసేందుకు మేము స్థిరంగా కృషి చేస్తూనే ఉన్నాం. మా సరళీకృత స్టేట్మెంట్స్, ధరల నియంత్రణ కోసం టారిఫ్ మేనేజర్స్, ప్రతి వారం చెల్లింపులు వంటివి వారితో మా అనుబంధాన్ని బలోపేతం చేశాయి. మా పార్టనర్ అధ్యయనాలలో వచ్చిన ఫలితాల పట్ల మేము ఆనందంగా ఉన్నాం. తరువాత దశకు మా అనుబంధం తీసుకువెళ్లేందుకు రెండవ ఎడిషన్ క్లబ్ రెడ్ను ఈపీపీ కింద ఆవిష్కరించాం’’అని అన్నారు.