Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ తాజాగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను కొనుగోలు చేయనున్నట్టు రిపోర్ట్లు వస్తున్నాయి. ఇందుకోసం రూ.7300 కోట్లు చెల్లించనున్నట్టు సమాచారం. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద విద్యాసంస్థల ఒప్పందంగా నిలువనుంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులకు డిమాండ్ మరింత పెరగడంతో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బైజూస్ ఏకంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ సంస్థతోపాటు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, బాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి భారీగా నిధులను సమకూర్చుకుంది. దీంతో బైజూస్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరినట్లు పరిశ్రమ వర్గాల అంచనా.