Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ:జపాన్ దేశం ఒసాకాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన డైసెల్ కార్పొరేషన్, చెన్నై పాత మహాబలిపురం రోడ్లోని తదుపరితరం పారిశ్రామిక టౌన్షిప్ క్యాపిటాల్యాండ్ ఒన్హబ్ చెన్నైలో ఎయిర్బ్యాగ్ ఇన్ఫ్లేటర్తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఫేజ్ 1లో సుమారు రూ.230 కోట్లపెట్టుబడి పెట్టనుండగా, ఇది భారతదేశంలో డైసెల్ కార్పొరేషన్కు మొట్టమొదటి ఎయిర్బ్యాగ్ ఇన్ఫ్లాటర్ తయారీ పరిశ్రమ కానుంది.
క్యాపిటాల్యాండ్ ఇండియా బిజినెస్ పార్క్స్ సీఈఓ వినమ్రా శ్రీవాస్తవమాట్లాడుతూ 'మేము డైసెల్ను భారతదేశానికి ఆహ్వానిస్తూ, ఒన్ హబ్ చెన్నై ప్రముఖ బహుళ-జాతీయ సంస్థల సముదాయంలో చేరేందుకు స్వాగతిస్తున్నాము. ఒన్ హబ్ చెన్నై వారి ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు సరైన పర్యావరణ వ్యవస్థ మరియు ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలను అందిస్తుంది. డైసెల్కు కీలకమైన మైలురాయిలో భాగం అవుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము మరియు భారతదేశంలో వారి అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు వేచి చూస్తున్నామని' పేర్కొన్నారు.
డైసెల్ కార్పొరేషన్ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ టకాసే యోషిఫుమి మాట్లాడుతూ
'థాయ్లాండ్ మరియు ఇతర దేశాలలో మా ఉత్పత్తి కేంద్రాల నుంచి ఇప్పటివరకు మేము భారత మార్కెట్కు ఉత్పత్తులు సరఫరా చేస్తూ వచ్చాము. అయినప్పటికీ, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వృద్ధి సామర్థ్యం మరియు భారతదేశంలో ఆటోమొబైల్ తయారీదారులు మరియు ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్ తయారీదారుల సప్లయ్ చెయిన్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నందున, ఒన్ హబ్ చెన్నైలో స్థానిక ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము. స్థిరమైన ఉత్పత్తి మరియు ఉత్పత్తుల సరఫరాతో భారత మార్కెట్లో మా ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటాము. ఇన్ఫ్లేటర్ఉత్పత్తి మరియు దేశంలో విడి భాగాల సేకరణ రెండింటి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతామని' తెలిపారు. ఈ ప్లాంట్ దేశంలో ఆటోమొబైల్ ఎయిర్బ్యాగ్ ఇన్ఫ్లేటర్కు పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించనుంది. డైసెల్ డిసెంబర్ 2023 నాటికి తన ఉత్పత్తిని ప్రారంభించనుంది.
అంతకు మునుపు అక్టోబర్ 2018లో, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో వృద్ధికి మరియు భద్రతా నిబంధనలను కఠినతరం చేయడానికి ప్రతిస్పందనగా, డైసెల్ సేల్స్ బేస్ (డైసెల్సేఫ్టీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఎస్ఐ, గురుగ్రామ్, హర్యానా)ను నెలకొల్పింది.