Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలోనూ రికార్డుస్థాయిలో..
న్యూఢిల్లీ : కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇది ప్రతి రంగం పైనా ప్రభావం చూపింది. అయితే, ఈ ప్రమాదకర కరోనా మహమ్మారి దేశంలో ట్రాక్టర్ల అమ్మకాలపై మాత్రం ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. గతేడాది దేశంలో వీటి అమ్మకాలు ఆల్టైం రికార్డును తాకింది. మొత్తం 8,02,670 యూనిట్ల వద్ద ట్రాక్టర్ల అమ్మకాలు ముగిశాయి. ఇది 2018లో నమోదైన రికార్డును మించి (ఒక శాతం అధికం) కావడం గమనార్హం.
అలాగే 2019 ఏడాదితో పోల్చితే 11శాతం అధికం. 2020 ఏడాదిలో అత్యల్పంగా ఏప్రిల్ నెలలో 12 వేల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఆ ఏడాది ప్రతినెలలో జరిగిన అమ్మకాలతో పోల్చుకుంటే ఇది ఐదు రెట్లు తక్కువ కావడం గమనార్హం. అయితే, కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగానే ఈ నెలలో అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే, ఈ విధంగా ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడం పరిశ్రమకు శుభపరిణామం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ''గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక సానుకూల కారకాల కారణంగా ఈ వృద్ధి దేశీయ ట్రాక్టర్ పరిశ్రమ వృద్ధికి దారి తీసింది'' అని మహీంద్రా వ్యవసాయ సామాగ్రి రంగం అధ్యక్షుడు హేమంత్ సిక్కా అన్నారు.