Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : తమ రాష్ట్రంలోని స్టార్టప్లకు ఆర్థిక మద్దతును ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా వెంచర్ కాపిటల్ (వీసీ) ఫండ్ను ఏర్పాటు చేసే కసరత్తులో ఉంది. ఎంటర్ప్రైజ్ ఫౌండర్స్ నిర్వహించిన కేరళ స్టార్టప్ మిషన్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంక్లు, కేరళ స్టేట్ ఇండిస్టీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఐడీసీ)లు కలిసి వీసీ ఫండ్ను అందించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. దీని ద్వారా పాలసీ ద్వారా స్టార్టప్లకు ఆర్థిక మద్దతు లభించనుందన్నారు. కొత్త ఎంటర్ప్రైజెస్లను ప్రోత్సహిస్తామన్నారు. అదే విధంగా ఔత్సాహికవేత్తలుగా మార్చడానికి కావాల్సిన నైపుణ్యతలను పెంచుతామన్నారు. దేశంలోనే తొలిసారిగా కేఎస్యూఎం ఆధ్వర్యంలోని కేరళ స్పెసిఫిక్ ఎంజిల్ ఫండ్ ద్వారా ఇప్పటికే 11 స్టార్టప్లకు ఆర్థిక మద్దతును అందించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.