Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి వివిధ మోడళ్ల ధరలను రూ.5వేల నుంచి రూ.34వేల వరకు పెంచినట్టు తెలిపింది. దీంతో ఈ ఏడాది కొత్త కారు కొనేవారు అదనంగా మరింత సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన నూతన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ కంపెనీ వెల్లడించింది. పెరిగిన ఉత్పాదక వ్యయం నేపథ్యంలో ధరలను పెంచక తప్పలేదని స్పష్టం చేసింది. ధరల పెంపునకు ముందు మారుతి కార్ల ధరల శ్రేణి రూ.2.95 లక్షల నుంచి రూ.11.52 లక్షలుగా ఉన్నది. కరోనా ప్రభావం తర్వాత డిసెంబర్ నెలలో మారుతి కార్ల అమ్మకాలు 20 శాతం మేర పెరిగినట్టు సంస్థ ప్రకటించింది.