Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్రిటన్లోని ప్రముఖ వ్యాపార బ్యాంకింగ్ ఫిన్టెక్ సంస్థ 'టైడ్' భారత్లో ప్రయోగాత్మకంగా 2021 తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం టైడ్ ఇప్పటికే దేశీయంగా ఓ అనుబంధ సంస్ధను ఏర్పాటు చేసింది. గురుగావ్ కేంద్రంగా ఇండియా సీఈఓ గుర్జోద్పాల్ సింగ్, కమర్షియల్ బందం కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తమ రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ ఇప్పుడు టైడ్ సంస్ధకు అంతర్జాతీయ డెవలప్మెంట్ కేంద్రంగా నిలువనుంది. ఇప్పటికే ఇక్కడ 100కు పైగా టెక్నాలజీ నిపుణులను నియమించుకున్నట్టు తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్లలోని బందాలు అత్యంత వేగంగా వద్ధి చెందడంతో పాటుగా భారతదేశంలో టైడ్ ఎదుగుదలకు మద్దతునందించనుందని ఆ కంపెనీ తెలిపింది.