Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) హైదరాబాద్ రీజియన్ పరిధిలో బుధవారం ఎయిమ్స్ బిబి నగర్ శాఖను తెరిచింది. దీన్ని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, బిఒబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖిచి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ సాధించిన లక్ష్యాలు, అందించిన రుణాలను సింగ్ ఖిచి వివరించారు. కార్పొరేట్ సామాజిక సేవలో భాగంగా రోగుల సౌకర్యార్థం హాస్పిటల్కు అంబులెన్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఒబి హైదరాబాద్ జోనల్ హెడ్ మన్మోహన్ గుప్తా, డిజిఎం, ఎంజిఎం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.