Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పియాజ్జియో ఇండియా చైర్మెన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని డీలర్షిప్లను తెరువనున్నామని పియాజ్జియో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డియాగో గ్రాఫీ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమకు 50కి పైగా అవుట్లెట్లు ఉన్నాయని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎక్స్షోరూం వద్ద ఈ ప్రీమియం స్కూటర్ ధరను రూ.1,26,372గా నిర్ణయించామన్నారు. దీనిని తొలుత రూ.5వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ స్కూటర్ ఏడు లీటర్ల ఇంధన ట్యాంకు సామర్థ్యంతో వస్తుందన్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 51,700 యూనిట్లను విక్రయించామన్నారు. ప్రస్తుత ఏడాదిలో రెండంకెల వృద్థిని అంచనా వేస్తున్నామన్నారు.