Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్తో తమ సంస్థ భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు తన్లా ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఛైర్మన్, సిఇఒ ఉదరు రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్లాక్ చెయిన్ ఎనేబుల్ చేసిన సిపిఎఎఎస్ ప్లాట్ఫామ్ వైజ్లీనీ అందుబాటులోకి తెచ్చామన్నారు. తన్లా కోసం ఈ ప్లాట్ఫామ్ను మైక్రోసాఫ్ట్ అభివృద్థి చేసిందన్నారు. మార్కెట్ప్లేస్ సంస్థలను ప్రపంచ వ్యాప్తంగా సరఫరాదారులు, సేవ సంస్థలను కొనుగొనటానికి వైజ్లీ ఉపయోగపడుతుందన్నారు. ఇది సంస్థలు, మొబైల్ క్యారియర్లు, ఒటిటి ప్లేయర్లు, విక్రయదారులకు డేటా భధ్రత, గోప్యతను కల్పిస్తుందన్నారు.