Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగదుకు తగ్గ విలువను అందించే ఈవీ తయారీదారు జెమోపాయ్ ఎలక్ట్రిక్ నేడు తమ నాలుగు నూతన డీలర్షిప్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో తెరిచినట్లు వెల్లడించింది. విద్యుత్ వాహనాల ప్రాప్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా, జెమోపాయ్ ఇప్పుడు ఎంపిక చేసిన ఈవీ తయారీదారులతో చేరడంతో పాటుగా ఈ ప్రాంతంలో తమ ఉనికిని మరింతగా బలోపేతం చేసుకోనుంది. ఈ కంపెనీ ఇప్పుడు ట్రైడ్ మొబిలిటీతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా హైదరాబాద్, వైజాగ్ నగరాలలోని వినియోగదారులకు వాణిజ్య అనుభవాలను అందించనుంది. ఈ కంపెనీ ఇప్పటికే దక్షిణ భారతదేశంలో తమ వాహనాలకు అపూర్వ ఆదరణను అందుకుంటుంది. సంస్థకు ఇప్పటికే హైదరాబాద్లో మొత్తంమ్మీద ఆరు స్టోర్లు ఉన్నాయి. జెమోపాయ్తో పాటుగా ట్రైడ్ మొబిలిటీ ఇప్పుడు సంయుక్తంగా మరో 10 అదనపు డీలర్షిప్లను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 2021 ఆర్థిక సంవత్సరాంతానికి తెరువడానికి ప్రణాళిక చేశాయి.
ఈ డీలర్షిప్ స్టోర్లు తెరువడం గురించి జెమోపాయ్ ఎలక్ట్రిక్ కో–ఫౌండర్ అమిత్ రాజ్ సింగ్ మాట్లాడుతూ ‘‘విద్యుత్ వాహనాల స్వీకరణ గణనీయంగా పెరుగుతుంది. మహమ్మారి కారణంగా వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఈ డీలర్షిప్ స్టోర్లు ఇప్పుడు మా వినియోగదారులు మా సురక్షిత మరియు అందుబాటు శ్రేణి ఈవీలను పొందడంలో సహాయపడటంతో పాటుగా ప్రతి రోజూ ప్రయాణాలను సైతం సమూలంగా మార్చనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ట్రైడ్ మొబిలిటీతో భాగస్వామ్యం చేసుకుని ఈవీలను మా వినియోగదారులకు మరింత చేరువ చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వారు తమ సంపూర్ణ మద్దతునందించడంతో పాటుగా ఈ ప్రాంతంలో డీలర్షిప్ తెరిచేందుకు తమ అనుభవాన్ని సైతం మాకు అందించారు’’ అని అన్నారు.జెమోపాయ్ ఎలక్ట్రిక్ యొక్క ప్రస్తుత ఫ్లీట్లో అస్ట్రిడ్ లైట్, రైడర్, మిసో ఉన్నాయి. ఈ పూర్తి శ్రేణి డీలర్షిప్ స్టోర్ల ద్వారా లభ్యమవుతాయి. జెమోపాయ్కు భారీ స్థాయిలో 70కు పైగా డీలర్షిప్ స్టోర్లతో కూడిన నెట్వర్క్ ఉంది మరియు 2021 ఆర్థిక సంవత్సరాంతానికి దక్షిణ భారతదేశంలో మరో 100 అదనపు స్టోర్లను ప్రారంభించేందుకు ప్రణాళిక చేసింది. తద్వారా దేశంలో అత్యంత సమర్థవంతమైన రీతిలో ఈవీలను స్వీకరించడాన్ని కొనసాగించనుంది.
ట్రైడ్ మొబిలిటీ డైరెక్టర్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ భావి తరపు రవాణా మరియు వినియోగదారుల అనుభవాలను పునర్నిర్వచించాలనే లక్ష్యంతో మేము జోమోపాయ్తో భాగస్వామ్యం చేసుకున్నాం. నమ్మకం, సాంకేతికతను నిర్మించడంతో పాటుగా మా నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చాలనుకుంటున్నాము మరియు మాతో పాటుగా రాబోయే తరాలకు సుస్ధిరమైన రేపటి దిశగా పయణించాలనుకుంటున్నాము. జెమోపాయ్ వాహనాలు అత్యంత అందుబాటు ధరలో ఉండటంతో పాటుగా ఆధారపడతగినవి మరియు అత్యున్నత శ్రేణి విద్యుత్ వాహనాలు. ఏ తరపు ఈవీ స్వీకరణదారులు అయినా వీటిని సొంతం చేసుకోవచ్చు’’ అని అన్నారు.
పునరుద్ధరించిన మరియు ధృవీకృత పెట్రోల్ బైక్లను విక్రయించడంలో సుప్రసిద్ధమైన సంస్థ ట్రైడ్ మొబిలిటీ. ఇటీవలనే జెమోపాయ్ మరియు ఫిట్నెస్ బైసైకిల్స్తో భాగస్వామ్యం చేసుకుని విద్యుత్ బైక్ల విక్రయ మార్కెట్లో ప్రవేశించింది.
‘‘ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలకు ధన్యవాదములు. విద్యుత్ స్కూటర్లకు ఇప్పుడు మార్కెట్లో అమితాదరణ ఉంది. ఈ వాహనాలు ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతుండటానికి ఈ వాహనాల యొక్క అతి తక్కువ నిర్వహణ ఖర్చులు కారణం. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు గణనీయంగా పెరుగుతుండటం చేత ఐస్ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) ఆధారిత స్కూటర్ల నిర్వహణ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రోత్సాహకాలను ప్రకటించడంతో పాటుగా విద్యుత్ వాహనాల స్వీకరణ కోసం పలు రాయితీలనూ ప్రకటించింది. అయినప్పటికీ దీని యాజమాన్య నిర్వహణ ఖర్చుల పట్ల మరియు ఈ వాహన వినియోగదారులకు కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన లేమి అతి పెద్ద అవరోధాలుగా నిలుస్తున్నాయి. వాటిని మేము అధిగమించాలనుకుంటున్నాము’’ అని జెమోపాయ్ ఎలక్ట్రిక్ కో ఫౌండర్ అమిత్ రాజ్ తెలిపారు.