Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏడాదిలో మొదటి పండుగ, మకర సంక్రాంతి ఈ సంవత్సరం మొదటి సారి లాంగ్ వీకెండ్ను తీసుకు వచ్చింది. భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ బస్సు టికెటింగ్ ప్లాట్ఫారం రెడ్ బస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్ సిటీ ప్రయాణానికి దృఢమైన డిమాండ్ ఉన్నట్లు గుర్తించింది. పెంట్-అప్ డిమాండ్తో సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. కొవిడ్ టీకా కార్యక్రమం గురించి వార్తల రావడంతో, 2021 ప్రారంభంలో ధీమాతో ప్రయాణాలను చేసేందుకు ఎక్కువ మంది ప్రేరణ పొందారు. లాంగ్ వీకెండ్లో వచ్చిన సంక్రాంతి పండుగ (జనవరి 14 నుంచి 17 వరకు) సుమారుగా 4 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. రెడ్ బస్పై సంక్రాంతి పండుగ జనవరి 14కు 8 రోజుల ముందుగానే బుకింగ్లు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రాంతీయ రవాణా సంస్థలతో (ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ) కలిపి సుమారు 230 ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, నిత్యం 9,000 డైలీ సర్వీసులను నడిపి ఏడాదిలోనే గరిష్ట ప్రయాణ రోజులను అందించారు.
సంక్రాంతి సమయంలో హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ఎక్కువ మంది ప్రయాణించారని రెడ్బస్ తన వద్ద ఉన్న డేటా ఆధారంగా గుర్తించింది.
డేటా ప్రకారం, సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టాప్ 10 రూట్లు ఇలా ఉన్నాయి:
టాప్ రూట్లు (ఇరువైపులా రాకపోకలు)
హైదరాబాద్-బెంగళూరు
విజయవాడ-హైదరాబాద్
విశాఖపట్నం- హైదరాబాద్
విశాఖపట్నం- విజయవాడ
హైదరాబాద్-గుంటూరు
హైదరాబాద్-గోవా
విజయవాడ- బెంగళూరు
నెల్లూరు-హైదరాబాద్
ఒంగోలు-హైదరాబాద్
నెల్లూరు-బెంగళూరు
ప్రయాణాలకు సంబంధించి జరిగిన అన్ని బుకింగ్లలో 80% బుకింగ్లు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి జరిగాయి. వీటిలో 62% బుకింగ్లు నాన్-ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో జరిగాయి.
సుమారు 56% మంది ప్రయాణికులు చిన్న, మధ్య తరహా పట్టణాలు, నగరాల మధ్య ప్రయాణించారు. సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో జరుపుకునేందుకు ఎక్కువ మంది తమ స్వగ్రామాలకు వచ్చారని దీనితో స్పష్టమైంది. ఈ ఏడాది సంక్రాంతికి, దేశంలో బుక్ చేయబడిన అతి తక్కువ దూరంలో ఉన్న ఇంటర్ సిటీ బస్సు మార్గం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మరియు విశాఖపట్నం మధ్య ఉండగా, ఇది 49 నిమిషాల్లో 24 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది మరియు ఎక్కువ దూరంలోఉన్న ఇంటర్ సిటీ బస్సు మార్గం హైదరాబాద్ మరియు బాలేసర్ మధ్య ఉండగా ఇది, తెలంగాణ మరియు రాజస్థాన్ మధ్య 1600 కి.మీ. దూరాన్ని 30 గంటల్లో కవర్ చేస్తుంది.
రష్ సమయంలో భద్రతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వగా, రెడ్బస్ తన భద్రతం కార్యక్రమంలో భాగంగా బస్ ఆపరేటర్లు మరియు ప్రయాణికులకు వర్తించేలా నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి సేవలు అందించింది. దీని ప్రకారం, ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రయాణించే సమయంలో మాస్కులు ధరించవలసి ఉంటుంది. బస్సుల్లో చేతిని శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, ఇతర వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. బోర్డింగ్ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు మరియు ప్రయాణికుల కోసం ఆపరేటర్లు ఎటువంటి వస్త్రాలు, దుప్పట్లను అందించలేదు. ఈ నిబంధనలను అనుసరించడంతో పాటు, మార్గదర్శకాల ప్రకారం ప్రతి ట్రిప్ అనంతరం బస్సులను సమగ్రంగా శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా రెడ్బస్ సీఈఓ ప్రకాష్ సంగం మాట్లాడుతూ.. నిరుడు అక్టోబర్లో పండుగ సీజన్ నుంచి సంక్రాంతి వరకు ప్రయాణ వేగం కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. ఇది మనమందరం చాలా ఓపికతో ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. 2021లో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మరియు ప్రయాణికుల ప్రయాణ ఆకాంక్షల చుట్టూ ఉన్న ఆశావాదంతోనే రవాణా పరిశ్రమ గత కాలపు గడ్డు పరిస్థితులను నుంచి వేగంగా కోలుకుంటుందని విశ్వసిస్తున్నాము. ఇదే అంశం ఆదారంగా ఇంటర్సిటీ బస్సు పరిశ్రమకు స్థిరమైన పురోగతి సాధిస్తూ, కొవిడ్కు ముందున్న పరిస్థితులకు త్వరలో చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.