Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్రాడేలో సెన్సెక్స్ @50వేలు
- ఓ దశలో 785 పాయింట్లు ఫట్ొ తుదకు 167 పాయింట్ల నష్టం
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో ఉదయం ఉన్న జోష్.. మధ్యాహ్నానానికి ఆవిరియ్యింది. గురువారం బీఎస్ఈ సెనెక్స్ 50 వేల పాయింట్ల ఎగువున నమోదై.. చరిత్రలోనే ఇది వరకు ఎప్పుడూ లేని రికార్డ్ నమోదు చేస్తోందన్న సంతోషాలు మదుపర్లలో ఎంతో సమయం నిలువలేదు. పలు పరిణామాలతో ఓ దశలో బిఎస్ఇ సెన్సెక్స్ ఏకంగా 785 పాయింట్లు పతనమై రికార్డ్ గరిష్టం నుంచి 49,399కు పడిపోయింది. తుదకు 167 పాయింట్లు లేదా 0.34 శాతం కోల్పోయి 49,625కు దిగజారింది. ఇంట్రాడేలో 50,126 వద్ద నమోదయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 14,590 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు నష్టాలను చవి చూశాయి. పిఎస్యు బ్యాంకింగ్ 3.27 శాతం, రియాల్టీ 2.56 శాతం, లోహ 2.18 శాతం, ఫార్మా 1.43 శాతం చొప్పున విలువ కోల్పోయాయి.
సెన్సెక్స్-30లో 10 స్టాక్స్ మాత్రమే లాభపడగా.. 20 సూచీలు నష్టాలను చవి చూశాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, రిలయన్స్ సూచీలు అత్యధికంగా 2-2.7 శాతం మధ్య పెరగ్గా.. ఒఎన్జిసి, భారతీ ఎయిర్టెల్, ఎస్బిఐ, ఎన్టిపిసి, సన్ ఫార్మా సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం, బడ్జెట్పై సానుకూల అంచనాలతో భారత స్టాక్ మార్కెట్లు తొలుత ఉత్సాహంగా నమోదయ్యాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడికి తోడు కరోనా వాక్సిన్ 'కోవిడ్స్షీల్డ్'ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్ట్యూట్లో అగ్ని ప్రమాదం జరిగిందన్న వార్త మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని బ్రోకర్లు అభిప్రాయపడ్డారు.