Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నికర లాభాలు 14 శాతం పెరిగి రూ.154 కోట్లకు చేరాయి. బ్యాంక్ మొండి బాకీలు తగ్గడంతో ఫలితాలకు ప్రధాన మద్దతు లభించింది. కాగా.. 2019-20 ఇదే క్యూ3లో రూ.135 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,319 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో రూ.3,577 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 7.69 శాతం తగ్గి రూ.8,072.43 కోట్లుగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు 2.59 శాతం తగ్గి రూ.2,578 కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2020 డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం 13.15 శాతం పెరిగి రూ.2,66,875 కోట్లకు చేరింది.