Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు స్వచ్ఛమైన గాలి అవసరం
- సెరీనా మీట్ అండ్ గ్రీట్లో యువనటి దిగంగనా సూర్యవంశీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెరిగింది. మనం తీసుకునే ఆహారం, గాలి, పరిసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పీల్చే గాలిలో కూడా స్వచ్ఛతను కోరుకుంటున్నారు. స్వచ్ఛమైన గాలినిచ్చే సెరీనా ఎయిర్ ప్యూరిఫయర్కు మార్కెట్లో చక్కటి ఆదరణ లభిస్తున్నది' అని యువ నటి దిగంగనా సూర్యవంశీ అన్నారు. హైదరాబాద్లోని సారధి స్టూడియోలో సెరీనా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సెరీనా బ్రాండ్ అంబాసిడర్ అయిన దిగంగనా మాట్లాడుతూ తాను షూటింగ్లకు వెళ్లినప్పుడు బయటి వాతావరణంలోని గాలి, నీరు వల్ల చర్మం మీద రాషెస్ వచ్చేయని సెరీనా వాడిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వీలుగా సెరీనా ఉందన్నారు. సెరీనా ఎయిర్ ప్యూరిఫయర్ హెడ్ ఆఫ్ ఆపరేషన్ నూతన్ చొక్కారెడ్డి మాట్లాడుతూ రూమ్లో, ఆఫీస్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా సూక్ష్మజీవులు గాలిసిపోయి ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. కరోనా తర్వాత గాలిలో బ్యాక్టీరియా, కాలుష్యాన్ని రూపుమాపేందుకు, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, బాంక్రిటీస్, ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడంలో భాగంగా స్వచ్ఛమైన గాలిని అందించేందుకు సెరీనా ఎయిర్ ప్యూరిఫయర్ను మార్కెట్ లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇది గాలిలోని బ్యాక్టీరీయా, వైరస్ను చంపేస్తుందన్నారు. ఇది క్లౌడ్తో కనెక్ట్ అయినందువల్ల దీనికి ఎక్కడినుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చని నూతన్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలిని కోరుకునేవారు తమ ప్రొడక్ట్ను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సెరీనా కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ తౌసిఫ్ ఖాన్ పాల్గొన్నారు.