Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతాబ్దపు బడ్జెట్
- వెబినార్లో విశ్లేషించిన నిపుణులు
హైదరాబాద్: యూనియన్ బడ్జెట్ 2021 ప్రవేశ పెడుతున్న వేళ, గీతమ్(డీమ్డ్ యూనివర్శిటీ)కు అనుబంధంగా ఉన్నటువంటి కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, హైదరాబాద్ ఓ అత్యున్నత స్థాయి వెబినార్ను ‘‘బడ్జెట్ 2021 మహమ్మారి, ప్రజలు మరియు విధానాల నిర్వహణ’’ అనే అంశంపై పలు రంగాలకు చెందిన విధాన రంగ నిపుణులతో నిర్వహించింది. భారతీయ ఆర్థిక వ్యవస్ధపై మహమ్మారి విసిరిన సవాళ్లను ఈ సదస్సులో చర్చించడంతో పాటుగా ఈ సంవత్సరం కోసం బడ్జెట్ను ఎంత గొప్పగా వినియోగించుకోవాలి, తద్వారా దేశాన్ని ఈ కష్టకాలంలో గట్టెక్కించాలనేది కూడా చర్చించారు.
భారతదేశంలో ప్రజా విధానాలను పునరాలోచించాల్సిన తప్పనిసరి ఆవశ్యకతను గురించిన చర్చతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. ఈ ప్యానెల్ ప్రధానంగా ప్రస్తుత టాప్ డౌన్ విధానం, భారతదేశానికి ఎందుకు సుస్ధిర నమూనా కాదో చర్చించింది. ప్రస్తుత ప్రక్రియలలోని ఖాళీలను పూరించడమనేది కేవలం ప్రొఫెషనల్స్కు శిక్షణ అందించడం ద్వారానే సాధ్యమవుతుందంటూ వారు మాత్రమే ఆధునిక భారతావని ఎదుర్కొంటున్న సవాళ్లను నిర్వహించగలరు. పబ్లిక్ పాలసీ అనేది సాంకేతికాంశం అనే ఆలోచన మారాలి, దానితో పాటుగా దాని వెనుక ఉన్న కళాత్మకత, శాస్త్రం అర్థం చేసుకోవాలి.
ఈ సదస్సులో పాల్గొన్న ప్యానలిస్ట్లలో శ్వేతా రాజ్పాల్ కోహ్లీ, హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, సీక్వోయా క్యాపిటల్– ఇండియా అండ్ ఆగ్నేయాసియా, ఇందర్మిత్ సింగ్ గిల్, నాన్ రెసిడెంట్ సీనియర్ ఫెలో, బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్, యామిని అయ్యర్– ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, నిధి రజ్డాన్, సీనియర్ జర్నలిస్ట్, పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎన్డీటీవీ, రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ సభ్యులు (టీడీపీ) ఉన్నారు. ఈ ప్యానల్ లో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక సభ్యులు ఎం.భరత్, అధ్యక్షులు, గీతమ్, ప్రతీక్ కన్వాల్, కో–ఫౌండర్, శ్రీధర్ పబ్బిశెట్టి, ఫౌండింగ్ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు.
ఈ స్పీకర్లు వృద్ధి చెందుతున్న నిరుద్యోగ స్ధాయి, అసమానత్వం పెరగడం మరియు డిమాండ్లో స్తబ్దతతో పాటుగా ఆరోగ్యం, విద్య మరియు సామాజిక సేవల మౌలిక వసతులకు ధైర్యవంతమైన పాలసీపరిష్కారాలను, నమ్మకమైన నిరూపిత ఆధారిత రూపంలో తీసుకోవాల్సి ఉంది. నేడు దేశానికి దాని వ్యవస్ధాపక ఆదర్శాల నుంచి ప్రేరణ పొందిన పరివర్తన అత్యవసరం అని వెల్లడించారు. ఈ సదస్సులో ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పలు అంశాలను గురించి సవివరంగా చర్చించారు. ఈ రంగాలకు తగిన ప్రాధాన్యతను అందించడం లేదు మరియు ఆర్ధికాభివృద్ధికి ఈ రంగాలలో అభివృద్ధి అత్యంత కీలకం. ఈ సహానుభూతి యొక్క ఆలోచన మమ్మల్ని విధాన నిర్ణేతల దృష్టికోణం నుంచి చూసేలా చూసింది తప్ప బడ్జెట్ వైపు చూసినప్పుడు ఓ వ్యక్తి దృష్టికోణం నుంచి కాదు. నిధులను దుర్వినియోగం గురించి కూడా ఈ ప్యానెల్ చర్చించింది మరియు ఈ సానుకూల మార్పులో ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకోవాల్సిఉందో కూడా తెలిపారు. ఈ సారి బడ్జెట్ రూపకల్పన కోసం ఎజెండా నిర్ణయించేటప్పుడు ప్రభుత్వంకు ఎదురయ్యే అతి ప్రధానమైన సవాళ్లను గురించి ఇందర్మిత్ సింగ్ గిల్ మాట్లాడుతూ ‘‘ కీలకమైన సంస్కరణల పరంగా చూస్తే ప్రభుత్వానికి ఏమంత గొప్ప రికార్డు ఏమీ లేదు. అందువల్ల, ఒకవేళ నేను ఆర్థికమంత్రిని అయి ఉండి ఉంటే ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకుంటాను. గత అభ్యాసాల నుంచి, నేను బిగ్ బ్యాంగ్ బడ్జెట్ చేయను. దానికి బదులుగా చిన్న చిన్న మార్పులకు తోడ్పడే కార్యక్రమాలపై దృష్టి సారిస్తాను. అవి ఆర్ధిక వ్యవస్థ మరియు జీడీపీకి భారీగా దోహదం చేస్తాయి’’ అని అన్నారు. యామినీ అయ్యర్, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రభుత్వం ప్రభావంతంగా అమలు చేయవచ్చనే అంశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా యామినీ మాట్లాడుతూ ‘‘లాక్డౌన్ తొలిదశలో నిర్వహించిన ఎన్నో అధ్యయనాలలో దాదాపు 65%కు పైగా అసంఘటిత రంగ కార్మికులకు తగినంతగా పొదుపు లేదని, ఒకవేళ వారు రెండువారాల పాటు పనిచేయకపోతే రోజుకు ఒక భోజనం పొందడం కూడా కష్టమేనని ఆ అధ్యయనాలు వెల్లడించాయి. మనం తప్పనిసరిగా సమ్మిళిత, విస్తృత స్థాయి, సామాజిక భద్రత అంశాలను గురించి చర్చించాలి. దాని ద్వారా నిరుపేదలను కాపాడటమే కాదు, ప్రపంచబ్యాంకు నిర్వచించిన రీతిలోని 50%కు పైగా పేద వర్గాలకు సైతం తోడ్పడటం సాధ్యమవుతుంది. ఒకే ఒక్క సారి ఆదాయానికి గండి పడితే అది మిమ్మల్ని దారిద్య్రంలోకి నెట్టి వేస్తుంది. అంటే దీనర్థం మనం తప్పనిసరిగా నగర కార్మికులను సైతం మిళితం చేసిన సేఫ్టీ నెట్స్ సమ్మేళనం గురించి ఆలోచించాల్సి ఉంది’’ అని అన్నారు.
శ్రీకాకుళం ఎంపీ కె.రామ్ మోహన్ నాయుడు (టీడీపీ) మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి మరియు వాటిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను గురించి మాట్లాడారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఓ పార్లమెంటేరియన్గా, నేను ఖచ్చితంగా పీఎస్యుల వెంట పడటాన్ని అసలు సూచించను. కొన్ని పీఎస్యులు తమ విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నాయన్నది వాస్తవం. కానీ, ప్రభుత్వం వాటిని విక్రయించడానికి బదులుగా వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని నేను నొక్కి చెబుతున్నాను’’ అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ పూర్వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్–ఎన్డీటీవీ నిధి రజ్డాన్ మాట్లాడుతూ బడ్జెట్లో తప్పనిసరిగా చర్చించాల్సిన ముఖ్యాంశాలను గురించి మాట్లాడారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ జీతం తీసుకుంటున్న ఓ ప్రొఫెషనల్గా, ట్యాక్స్ బ్రేక్ అనేది మధ్యతరగతి శాలరీడ్ ప్రొఫెషనల్స్ కోసం సిద్ధంగా ఉందని భావిస్తున్నాను. అధిక శాతం పన్నులను చెల్లించేది ఈ వర్గమే ! కొంతమంది అయితే దేశంలోని కోటీశ్వరులు ఎంత పన్ను కడుతున్నారో అదే తరహా పన్నులను చెల్లిస్తున్న వారు కూడా ఉన్నారు. దీనిని నిరోధించడానికి, మనం మన పన్నుల విధానాన్ని మరింత విస్తృతం చేయాల్సి ఉంది. తద్వారా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి సహాయపడాలి’’ అని అన్నారు.
శ్వేతా రాజ్పాల్ కోహ్లీ, హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ – సీక్వోయా క్యాపిటల్, ఇండియా అండ్ ఆగ్నేయాసియా మాట్లాడుతూ అంకుర సంస్ధల ప్రస్తుత స్థితి గురించి మాట్లాడారు. శ్వేతా మాట్లాడుతూ ‘‘మొదటి అర్థభాగంలో దాదాపు 15% మంది స్టార్టప్స్ తమ దుకాణాలను మూసేశారు. కానీ స్టార్టప్స్ నుంచి విస్తృతస్థాయి రికవరీని చూశాము. భారతదేశంలో, నిజానికి 2020 సంవత్సరం చివరి నాటికి 37 యునికార్న్స్ ఉంటే ఈ సంవత్సరం 11 అదనంగా జోడించబడ్డాయి. సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఎడ్టెక్, ఫిన్టెక్ మరియు హెల్త్టెక్ వంటివి మహమ్మారి తరువాత మరింత బలంగా వచ్చాయి’’ అని అన్నారు.
ప్రతీక్ కన్వాల్, కో–ఫౌండర్, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మాట్లాడుతూ పాఠశాల విద్య ఏ విధంగా ఉండాలో నొక్కిచెప్పారు. ఆయనే మాట్లాడుతూ ‘‘సాంకేతిక మౌలిక వసతుల రంగంలో ప్రభుత్వం పెట్టుబడులను వేగవంతం చేయాల్సి ఉంది. తద్వారా గ్రామీణ ప్రజలు సైతం కంప్యూటర్లను వినియోగించుకోవడం ద్వారా డిజిటల్ అవరోధాలను అధిగమించగలరు. అందువల్ల మీరు మరింత పేద వర్గాల పట్ల సానుకూలంగా ఉండాల్సి ఉంది. మరీ ముఖ్యంగా బాలికల విద్యపట్ల ! లేదంటే వీరు మరలా బాల కార్మికులుగా మారడంతో పాటుగా చిన్నారుల అక్రమ రవాణా, బాల్య వివాహాల వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సంక్షోభ సమయంలో వారిని కాపాడతామనే భరోసానూ అందించాలి’’ అని అన్నారు.
‘‘మనంతట మనం మన విద్యావ్యవస్ధను పలుచన చేయడంమే తప్ప మరే బాహ్య కారణాలూ దానిపై ప్రభావం చూపుతున్నాయని నేను భావించడం లేదు. మన పునాదులను మనం బలోపేతం చేసుకోకపోతే, దీర్ఘకాలంలో పెట్టుబడులు అనేవి నిష్పలంగా మారతాయి. ప్రజలకు ఆహారం అనేది టేబుల్పై ఉందన్న భరోసా కలిగించడంతో పాటుగా విశ్రాంతి కోసం ఓ ఇల్లు అనేవి ఇప్పుడు సుదూరమైన పెట్టుబడులుగా నిలుస్తున్నాయి. ఒకవేళ మనం ఈ సమస్యలను పరిష్కరించలేకపోతే మనం సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. భవిష్యత్ మానవ మరియు ఆర్థిక మూలధన అభివృద్ధి కోసం వనరులను కేటాయించడం అనేది తప్పనిసరి. ఈ కారణం చేతనే, బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయింపులు అయినా లేదా ఇనిస్టిట్యూషన్లకు నియంత్రణలనుంచి స్వేచ్ఛ అనేవి ప్రయోజనం కలిగిస్తాయి’’ అని శ్రీ భరత్, అధ్యక్షులు, గీతమ్ అన్నారు. తద్వారా ప్రభుత్వం తక్షణమే మరియు సుదీర్ఘకాలంలో అమలు చేయాల్సిన విధానాలను వెల్లడించారు.
శ్రీధర్ పబ్బిశెట్టి, వ్యవస్థాపక డైరెక్టర్, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మాట్లాడుతూ ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పరిపాలన’ అనే ప్రక్రియను కేంద్రం ఏ విధంగా అనుసరించాలో వెల్లడించారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ నలభై రెండు వేల కోట్ల రూపాయల బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ సంక్షేమ పన్నులను ఖచ్చితంగా మరింత ప్రభావవంతంగా వినియోగించాలి. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం మరియు పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర రంగాల కార్మికుల కోసం దీనిని వినియోగించాలి. మరో అంశం ఏమిటంటే, ప్రభుత్వం వద్ద పన్ను చెల్లింపుదారుల సమాచారం ఉంది మరియు ఆర్థిక కష్టాల కారణంగా పన్నులు చెల్లించలేని వారి సంఖ్యను తగ్గించడంతో పాటుగా వీరికి రాష్ట్రం తప్పనిసరిగా పునరుద్ధరణ అందించాలి. ఇదంతా కూడా ప్రభుత్వం వద్ద మాత్రమే ఉన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’’ అని అన్నారు.