Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పానాసోనిక్ కార్పోరేషన్కు పూర్తి అనుబంధ సంస్ధ అయిన పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా సోమవారం శ్రీసిటీ వద్ద తమ నూతన తయారీ కేంద్రానికి భూమిపూజ నిర్వహించినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం రెండు దశలలో రూ.600 కోట్ల పెట్టుబడిగా పెట్టాలని.. తొలి దశలో రూ.294.7 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపింది. ఈ కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలను సష్టించడంతో పాటుగా పారిశ్రామిక అభివద్ధికి సైతం మద్దతునందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ కంపెనీ ఎండి తెత్యుయాసు కవామోటో పేర్కొన్నారు. ఇక్కడ విద్యుత్ యంత్ర సామాగ్రిని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు ఈ నూతన యూనిట్ తమ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ తయారీ కార్యక్రమాలను ఏప్రిల్ 2022 నాటికి ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది.