Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధార్ అనుసంధానంతో సాధ్యం
- ఐటీ శాఖ కొత్త ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు శుభవార్త. ఐటీ శాఖ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఆధార్తో కూడిన ఐటీఆర్ ధ్రవీకరణల వల్ల ఆ శాఖ వేగంగా పన్ను వాపసులను జరుపుతోంది. అధిక పన్ను చెల్లింపులు జరిపిన వారికి, ముందస్తు పన్నులు జరిపిన వారికి ఇకపై కేవలం7-10 రోజుల్లోనే ఐటీ శాఖ ఆ సోమ్మును వెనక్కి చెల్లించనుంది. గతంలో ఇందుకోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కొన్ని కేసులలోనైతే తిరిగి చెల్లింపులకు సంవత్సరాల సమయం కూడా పట్టిన సంఘటనలు ఉన్నాయి.
పెరిగిన ఆన్లైన్ ఫైలింగ్
ఈ నెల 7తో ముగిసిన గడువు తేదీ నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐటీ శాఖకు ఈ-ఫైలింగ్ రూపంలో 2.06 కోట్ల రిటర్న్స్ అందాయి. ఐటీ శాఖకు చెందిన సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ 45.18 లక్షల రిటర్న్స్ను ప్రాసెస్ చేసి 22.14 లక్షల పన్ను చెల్లింపుదారులకు అధిక పన్ను చెల్లింపు సోమ్ములను వాపసు చేసింది.