Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉద్యోగ కల్పన సంస్థ టీమ్లీజ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓకు) రానుంది. దాదాపు రూ.450-500 కోట్ల సమీకరణకు గాను సంస్థ తాజాగా ఐపీఓకు రానున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా పత్రంలో (డీఆర్హెచ్పీ) పేర్కొంది. ఐపీఓలో భాగంగా సంస్థ రూ.150 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ ఉంది. దీనికి తోడు వాటాదారుల వద్ద ఉన్న దాదాపు 32.2 లక్షల షేర్లను కూడా ఈ ఐపీఓ ద్వారా విక్రయించనుంది. దీనికి తోడు కంపెనీ మరో 10వేల షేర్లను తమ కంపెనీ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేయనున్నట్లు సంస్థ తన డీఆర్హెచ్పీలో పేర్కొంది. మొత్తంగా ఐపీఓ ద్వారా సంస్థ రూ.450-500 కోట్ల మేర నిధులను సమీకరించనున్నట్లు సమాచారం.