Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలునకు గాను రాష్ట్ర శాసనసభల ఆమోదం తెలపాల్సిన 'మోడల్ లెజిస్లేషన్స్'ను (నమూనా చట్టాలకు) ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ రేపు (మంగళవారం) సమావేశం కానుంది. వచ్చే ఏడాది ఎప్రిల్1 నుంచి జీఎస్టీని అములలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లు ఆమోదానికి గాను ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గడంతో జీఎస్టీ అనుకున్న సమయానికి అమలులోకి వస్తుందన్న అంశంపై ఆశలు సన్నగిల్లాయి. అయినప్పటికీ కేరళా ఆర్థిక మంత్రి కె.ఎ. మణి నేతృత్వంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ ఈ విషయంలో అమలు తేదీతో సంబంధం లేకుండా తమ పనిని చేసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలునకు గాను సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ), స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) బిల్లులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలపాల్సి ఉంటుంది. వీటికి అదనంగా సమీకృత జీఎస్టీ చట్టాన్ని కూడా ప్రభుత్వాలు అనుకరించాల్సిన అవసరం ఉంటుంది.