Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ : రిలయన్స్ రిటైల్తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ఒప్పందంపై సోమవారం అమెజాన్కు సానుకూలంగా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాలతో ముకేశ్ అంబానీకి, బియానికి చెందిన ఫ్యూచర్ గ్రూపునకు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ ఒప్పందానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన విజ్ఞప్తిపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్, బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం ఫ్యూచర్ రిటైల్, గ్రూపు అధినేత కిషోర్ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రానున్న మూడు వారాల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఈ వివాదంలో ఎన్సీఎల్టీ విచారణ కొనసాగుతుందని తెలిపింది. రిలయన్స్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే ఫ్యూచర్స్లో అమెజాన్ 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా బియానీ అమెజాన్ను సంప్రదించకుండానే రిలయన్స్కు విక్రయించడంతో వివాదం నెలకొంది.