Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి తెచ్చిన కాల్కస్
హైదరాబాద్ : పేద, మధ్య తరగతి విద్యార్థులకు చౌకగా ఆన్లైన్ విద్యను అందించాలనే లక్ష్యంతో కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్యూట్ ఆధ్వర్యంలో ''కాల్కస్ ఇండియా ఎగ్జాం ప్రిపరేషన్'' యాప్ను ఆవిష్కరించింది. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదువుతున్నా.. ఏడాదికి కేవలం రూ.99 చెల్లించి అన్ని తరగతులకు చెందిన పరీక్షలకు సన్నద్దం కావొచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఉచిత టెస్టులను అందిస్తోన్నట్లు పేర్కొంది. ఇందులో మొత్తం 1324 పోటీ పరీక్షలకు సంబంధించిన 42 వేల ప్రాక్టీస్ టెస్ట్తో కూడిన 25 బండిల్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది. 'అందరికీ విద్య - అందుబాటు ధరలో అనే లక్ష్యంతో చౌక ధరలో అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకునే విధంగా ఈ యాప్ను అందిస్తున్నామని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు వాణీ కుమారి తెలిపారు.