Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: భారతదేశ అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ డబ్ల్యూఐ), 30 మిలియన్ డాలర్లకు మించిన ఆస్తులు కలిగిన వారి సంఖ్య రాబోయే ఐదేళ్లలో 63 శాతం వృద్ధి చెంది 11,198కి చేరుకోనుందని ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అయిన నైట్ ఫ్రాంక్ తన వెల్త్ రిపోర్ట్ 2021లో వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశం 6,884 మంది యూహెచ్ఎన్ డబ్ల్యూఐలకు, 113 మంది బిలియనీర్లకు నిలయంగా ఉం ది. భారతదేశంలోని బిలియనీర్ల క్లబ్ 2025 నాటికి 162 కు చేరుకొని 43% మేర గణనీయంగా వృద్ధి చెంద నుంది. ఈ వృద్ధి ప్రపంచసగటు వృద్ధి 24 శాతాన్ని, ఆసియా సగటు 38 శాతాన్ని అధిగమించనుంది. ఈ నివే దిక ప్రకారం, భారతదేశంలోని 1% కుబేరుల్లో చేరేందుకు ఓ వ్యక్తికి 60,000 డాలర్లు అవసరం. ఈ సంపద వృ ద్ధి అంచనాల ప్రకారం భారతదేశపు 1 % కుబేరుల క్లబ్ రానున్న ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది.
మక్కువతో పెట్టే పెట్టుబడుల పరంగా చూస్తే, భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లకు ఆభరణాలు అనేది అ త్యంత ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉంటోంది. ఆ తరువాత కళలు, గడియారాలు, వైన్, క్లాసిక్ కార్లు ఈ జాబితాలో ఉంటున్నాయి. ప్రపంచధోరణులకు అనుగుణంగానే 2020లో భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లు కూడా అ రుదైన విస్కీతో పోలిస్తే వైన్ కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021 లో భాగంగా కంపెనీ చేపట్టిన ఆటిట్యూడ్స్ సర్వే ప్రకారం, 2021లో భారతదేశంలో కొత్త ఇల్లు కొనుక్కుందామనుకునే యూహెచ్ఎన్ డబ్ల్యూఐ ల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రతీ ఐదు మంది భారతీయ అల్ట్రా –హై- నెట్ – వర్త్ వ్యక్తుల్లో ఒకరు 2021లో ఒక కొత్త ఇల్లు కొనే యోచనలో ఉన్నారు.
అంతర్జాతీయంగా యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లలో 43 శాతం మంది 12 నెలల క్రితంతో పోలిస్తే, పర్యావరణం, సా మాజికం, పాలన (ఈఎస్ జి) ఫోకస్డ్ పెట్టుబడులపై మరింత ఆసక్తితో ఉన్నారు. భారతదేశంలో అల్ట్రా – వెల్తీ భా రతీయుల్లో 46% మంది ఈఎస్ జి ఫోకస్డ్ పెట్టుబడులపై ఆసక్తితో ఉన్నారు. అయితే ఈఎస్ జి ఫోకస్డ్ ప్రాపర్టీ లపై పెట్టుబడి పెట్టడంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఈఎస్ జి సంబంధిత పెట్టుబడి అవకాశాల ను పొందేందుకు తమకు మరింత సమాచారం అవసరమని భారతీయ యూహెచ్ఎన్ డబ్ల్యూఐ లలో 89% మంది భావిస్తున్నారు.
నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మహమ్మారి అ నంతర కాలంలో ఆర్థిక కార్యకలాపాలు సామర్థ్యపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో, భారత్ రా బోయే కొన్నేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు బాటలు వేసుకుంటోంది. భారత్ ఆర్థికంగా మరింత శక్తివంతం కానుంది. ఆసియా సూపర్ పవర్ గా సుస్థిరస్థానం సాధించనుంది. కొత్త రంగాలకు అది బాట వేయ నుంది. నూతన ఆర్థిక అవకాశాలు ఆకర్షణీయ సంపద సృష్టి ఆస్తులను అందించనున్నాయి. అవి దేశంలో కొత్త సంపన్నులను జోడించనున్నాయి’’ అని అన్నారు.