Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో నం.1 స్మార్ట్ఫోన్ మరియు స్మార్ట్ టీవీ సంస్థ ఎంఐ ఇండియా ఇటీవల తన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రయాణంలో 5 ఏళ్లను పూర్తి చేసుకుంది. భారతదేశంలో తయారీ మరియు ప్రగతి యశోగాథలో నిబద్ధత కలిగిన భాగస్వామిగా, స్మార్ట్ఫోన్లు మరియు స్మార్ట్ టీవీలను స్థానికంగా తయారు చేయడం ఈ బ్రాండ్కు గమనార్హమైన ముందడుగు మరియు దేశంలో తన పరిధి వ్యాప్తికి ‘ఎంఐ’ అలవర్చుకునేందుకు మద్దతు అందిస్తోంది.
ప్రధాన మంత్రి మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం ప్రారంభించి, జారీలోకి తీసుకు వచ్చిన తరువాత దానికి అనుగుణంగా ఎంఐ ఇండియా తన అన్ని స్మార్ట్ఫోన్లను భారతదేశంలో తయారీ భాగస్వామిగా ఫాక్స్కాన్ మరియు ఫ్లెక్స్ సహకారంతో తయారు చేస్తోంది. ఎంఐ ఇండియా గత 9 నెలలు మహమ్మారి సమయంలో భారతదేశంలో స్మార్ట్ఫోన్ ఉత్పత్తిని తీవ్రం చేసిందని ప్రకటించింది
ఎ) ఇది రెండు నూతన తయారీ భాగస్వాములు- డిబిజి మరియు బివైడిలను భారతదేశంలో స్మార్ట్ఫోన్లను తయారీకి చేర్చుకుంది. డిబిజి హరియాణాలో స్మార్ట్ఫోన్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉండగా, బివైడి తమిళనాడులో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.
బి) నూతన భాగస్వాములు భారతదేశంలో ఎంఐ ఇండియాలో తయారీ సామర్థ్యం మరింత వృద్ధి చేసే నిరీక్ష ఉంది. డిబిజితో ఎంఐ ఇండియా భాగస్వామ్యం బ్రాండ్కు నెల ఉత్పాదన సామర్థ్యాన్ని 20% వృద్ధి చెందింది. బివైడ్ ఇండియా 2021 మొదటి భాగంలో కార్యాచరణను ప్రారంభించింది అనంతరం ఉత్పాదన సామర్థ్యం గమనార్హంగా ఆఫర్ అందించే నిరీక్ష ఉంది.
సి) నేడు ఎంఐ ఇండియా తన 99% మేర స్మార్ట్ఫోన్ స్థానికంగా భారతదేశంలో ఉత్పత్తి చేస్తుంది.
డి) ఎంఐ ఇండియా స్థానికంగా తయారీ అలాగే, స్మార్ట్ఫోన్ల విడిభాగాలను అందుబాటును వృద్ధి చేసుకుంటుంది. ఇది చాలా వరకు విడిభాగాలైన పిసిబిఎ (మదర్-బోర్డ్), సబ్ బోర్డు, కెమెరా మాడ్యూల్, బ్యాటరీ, బ్యాక్ ప్యానెల్, యుఎస్బి కేబుల్, ఛార్జర్లు, బ్లాక్స్లు తదితరాలను తయారు చేస్తోంది. ఈ అన్ని విడిభాగాలకూ స్మార్ట్ఫోన్ల 75% కన్నా ఎక్కువ విలువ ఆఫర్ అందిస్తున్నాము.
ఇ) ఈ విడిభాగాలను సన్ని ఇండియా, ఎన్వైటి, స్యాల్కంప్, ఎల్వై టెక్, సన్వోడ తదితర భాగస్వాముల సహకారంతో ఉత్పత్తి చేస్తుంది.
ఎంఐ ఇండియా స్మార్ట్ టీవీలను (ఎంఐ టీవీ బ్రాండ్లో భాగంగా) మూడేళ్ల కింద విడుదల చేసింది మరియు భారతదేశంలో 10 వరుస త్రైమాసికాల్లో నం.1 స్మార్ట్ టీవీ బ్రాండ్గా నిలిచింది. ఇది 2 ఏళ్ల కింద మేక్ ఇన్ ఇండియా ప్రయాణాన్ని తిరుపతిలో తన తయారీ భాగస్వామి డిక్సన్ టెక్నాలజీ నూతన ఫ్యాక్టరీని ఆరంభించడంతో ప్రారంభించింది. కంపెనీ ఇప్పటికే 3 మిలియన్ యూనిట్ల మేర మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్ టీవీలను విక్రయించింది. ఈ మహమ్మారి సమయంలో ఇది తన స్మార్ట్ టీవీ స్థానిక తయారీని బలోపేతం చేసింది:
ఎ) ఇది నూతన తయారీ భాగస్వామి- రేడియెంట్ టెక్నాలజీని భారతదేశంలో స్మార్ట్ టీవీల ఉత్పత్తికి చేర్చింది. రేడియెంట్ టెక్నాలజీ తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.
బి) నూతన ఉత్పాదన కేంద్రం ప్రారంభించిన తరువాత ఎంఐ ఇండియా నుంచి విక్రయం అయ్యే 100% స్మార్ట్ టీవీలు ఇప్పుడు మేడ్-ఇన్-ఇండియా.
నూతన తయారీ కేంద్రాలు ప్రారంభమైన అనంతరం విస్తరించిన ఎంఐ ఇండియా కుటుంబం భారతదేశంలో 60,000 ప్రజలకు విస్తరించింది. 2020 ఏడాదిలో ఎంఐ ఇండియా మరియు దాని వాటాదారులు 10,000 నూతన ఉద్యోగాలను సృష్టించగా, పూర్తి ఉద్యోగుల సంఖ్య 60,000కు చేరుకుంది. ఈ 60,000 సదృఢమైన ఉద్యోగుల శక్తి గత ఆరేళ్లలో 2014లో ప్రారంభమైన రోజు నుంచి పెరుగుతూ వస్తోంది మరియు అందులో తయారీ భాగస్వాములు, ఆఫ్టర్ సేల్స్, లాజిస్టిక్స్ మరియు కార్పొరేట్ ఉద్యోగులు (ఎంఐ ఇండియాకు ప్రత్యేకంగా పని చేసే బృందం సభ్యులు) ఉన్నారు.
ఈ కార్యక్రమం భారతదేశం, ప్రభుత్వపు మేక్-ఇన్ ఇండియా లక్ష్యానికి ఎంఐ ఇండియా లక్ష్యానికి దీర్ఘావధి నిబద్ధతను చాటి చెబుతుంది. ఈ కార్యక్రమం గురించి ఎంఐ ఇండియా మను కుమార్ జైన్ మాట్లాడుతూ ‘‘2020 అసాధారణమైన ఏడాది, మహమ్మారితో ఎదురైన పలు సవాళ్లు పూర్తి ప్రపంచం మరియు భారతదేశంలోని పంపిణీ శ్రేణిని ఛిద్రం చేసింది. ఇలా ఉన్నప్పటికీ ఎంఐ ఇండియా బృందం మా స్థానిక పంపిణీ శ్రేణి మరియు ఉత్పాదన సామర్థ్యాన్ని విస్తరించేందుకు కలిసి శ్రమిస్తోంది. మా స్థానిక తయారీ కొనసాగింపు విస్తరణతో మేము స్మార్ట్ఫోన్ మరియు స్మార్ట్టీవీ మార్కెట్ రంగంలో మా నాయకత్వ స్థానాన్ని కాపాడుకున్నాము అలాగే అత్యంత విశ్వసనీయ స్మార్ట్ఫోన్గా నిలిచాము.
భారతదేశ ప్రగతికి కట్టుబడి ఉన్న ఎంఐ ఇండియా, ప్రధానమంత్రి మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాన్ని 2015లో అలవర్చుకున్న మొదటి సంస్థల్లో ఒకటి. నేడు, మేము నూతన తయారీ భాగస్వాములైన డిబిజి మరియు బివైడిలను స్మార్ట్ఫోన్లకు మరియు స్మార్ట్ టీవీలకు రేడియెంట్ టెక్నాలజీని తయారీ భాగస్వామిగా చేసుకున్నాము. ఇప్పుడు 99% మేర మా స్మార్ట్ఫోన్లు మరియు 100% మా స్మార్ట్ టీవీలు భారతదేశంలో తయారవుతున్నాయి మరియు స్మార్ట్ఫోన్లకు పలు విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి లేదా భారతదేశం నుంచి అందుకుంటున్నాము. మేము భారతదేశాన్ని గ్లోబల్ ఉత్పాదన కేంద్రంగా నిర్మించడంలో చిన్న పాత్రను పోషిస్తున్నామని’’ వివరించారు.
దీని గురించి మరింత వివరిస్తూ ‘‘2020లో కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తక్కువ చేయడంపై దృష్టి సారించగా, మేము భారతదేశపు మార్కెట్లో మా ప్రగతి నిర్మాణపు ఇటుకలైన మా ఉద్యోగులను కలుపుకుని వెళ్లాము. 2020లో మేము 10,000 మందికి ఉద్యోగాలను సృష్టించాము. ఎంఐ ఇండియాలో మేము యువ వృత్తినిపుణలకు నాయకత్వ స్థానాలను తీసుకునేందుకు ఉత్తేజిస్తున్నాము. 64% మేర మా వ్యాపార నాయకులు 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారే ఉన్నారు. రిస్క్ తీసుకోవాలని కోరుకునే, యథాస్థితికి సవాలు విసిరే మరియు చాలా ముఖ్యంగా నూతన విషయాలను ప్రయత్నించే యువ అలానే డైనమిక్ ఎంఐ ఇండియా కుటుంబం గురించి మేము చాలా గర్విస్తున్నామని’’ పేర్కొన్నారు.
ఎంఐ ఇండియా సీఈఓ మురళీకృష్ణన్ తమ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘‘ఎంఐ ఇండియాలో మేము సదా మా తయారీ మరియు పంపిణీ శ్రేణి సామర్థ్యాలను విస్తరించడంపై నమ్మకాన్ని ఉంము మరియు దానితో అదనంగా 2 నూతన స్మార్ట్ ఫోన్ తయారీ భాగస్వాములైన డిబిజి మరియు బివైడి చేరడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. డిబిజి బావల్ (గుర్గావ్ వద్ద)కు చెందినది కాగా, ఉత్తర భారతదేశంలో తయారీ అడుగు జాడలను విస్తరించేందుకు అనుకూలతను కల్పించగా, బివైడి ఇండియా దక్షిణ చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉందని’’ తెలిపారు. దీని గురించి మరింత మాట్లాడుతూ ‘‘2020 ఏడాదిలో మేము మా స్మార్ట్ టీవీల తయారీని వృద్ధి చేశాము. నేడు, 100% స్మార్ట్ టీవీలు భారతదేశంలో తయారవుతున్నాయి. మేము దీన్ని 85% నుంచి 100% విస్తరించాము. ఇది రేడియెంట్ అప్లయన్సెస్ వంటి నూతన భాగస్వాములతో ఇది సాధ్యమైంది. తయారీ సామర్థ్యం వృద్ధి వృద్ధి చేసుకోవడం ద్వారా ఎంఐ ఇండియా తన ఉద్యోగ సృష్టిని 20% మేర పెంచుకుని 60,000కు విస్తరించగా, అందులో ఉద్యోగులు మరియు థర్డ్ పార్టీ మానవ వనరులను కలిగి ఉందని’’ వివరించారు.