Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగి కేంద్రీకృత, నాణ్యత నిర్వహణపై చర్చ
హైదరాబాద్: ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ)విజయవంతంగా 6వ ఎడిషన్ ఇండియా ఫార్మాస్యూటికల్ ఫోరమ్ను నిర్వహించింది. ఈ సంవత్సరం ‘రోగి కేంద్రీకృత ' నాణ్యత నిర్వహణ సరికొత్త ఉదాహరణ’ అనే నేపథ్యంతో నిర్వహించడంతో పాటుగా దీర్ఘకాలిక కోణంలో రోగి కేంద్రీకృత దృష్టిని కొనసాగించాల్సిన ఆవశ్యకతను ప్రధానంగా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నుంచి అగ్రశ్రేణి నాయకులు, నియంత్రణ సంస్ధలు, విద్యాసంస్ధలు మరియు ఆయా అంశాలలో నిపుణులు పాల్గొనడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఔషద పరిశ్రమలో నాణ్యత నిర్వహణ పరంగా శ్రేష్టతను మెరుగుపరచడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చర్చించారు.
డాక్టర్ వీజీ సోమానీ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ ‘‘ కోవిడ్–19 మహమ్మారి మనందరికీ ఎదురయ్యే సవాళ్లను తప్పనిసరిగా ఎదుర్కొనే రీతిలో నాణ్యమైన నిర్వహణ వ్యవస్ధలు ఉండాల్సిన ఆవశ్యకతను తెలిపాయి. అదే సమయంలో భద్రత, సమర్థత, నాణ్యతా ప్రమాణాల పట్ల ఖచ్చితమైన ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరమూ చాటి చెప్పింది. భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఉత్పత్తి, సరఫరా చైన్ మొదలైన అంశాల పరంగా ఈ పరిస్థితులను చురుగ్గా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో అత్యుత్తమ ప్రక్రియలనూ నిర్వహిస్తుంది’’ అని అన్నారు.
సతీష్ రెడ్డి, అధ్యక్షులు, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ మాట్లాడుతూ ‘‘ మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ముందుంది. మహమ్మారి ఆరంభమైన నాటి నుంచి ఐపీఏ యొక్క లక్ష్యం స్పష్టంగా సరఫరా చైన్ కొనసాగింపు, ఉద్యోగుల సంక్షేమం, ఆలోచనాత్మక నాయకత్వం అందించడం మరియు వేగంగా కోలుకునేలా చేయడంతో పాటుగా పరిశ్రమ వృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. మహమ్మారి ఉన్నప్పటికీ, అధికారులతో ఉన్నత స్థాయి సంబంధాలను కొనసాగిస్తూ విధాన అనుకూల వాదాన్ని చురుగ్గా కొనసాగిస్తుంది’’ అని అన్నారు. సమీనా హమీద్, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్, సిప్లా లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఇండియా అత్యంత వేగంగా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. అది మహమ్మారి కి వ్యతిరేకంగా స్పందించిన తీరులో కానీయండి, చికిత్సావకాశాలు, క్లీనికల్గా రోగులు లేదా వ్యాక్సిన్లను నిర్వహించడంలో కానీయండి అత్యంత వేగంగా స్పందించింది. ఇదే రీతిలో విలువ గొలుసుకట్టులో మన నాయకత్వ స్ధానాన్ని నిర్వహించడం ఆవశ్యకం. అదనంగా, ఫార్మా రంగం చూస్తోన్న వృద్ధి కోసం, నాణ్యత విషయంలో రాజీపడకూడదు. ఈ నిరంతర అభివృద్ధితో పాటుగా అంతర్జాతీయ ప్రక్రియలను స్వీకరించడం కూడా అత్యంత కీలకం’’ అని అన్నారు.
పంకజ్ పటేల్, ఛైర్మన్, కాడిలా హెల్త్కేర్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఔషద రంగంలో సరఫరా చైన్ పరంగా అంతర్జాతీయంగా ఉన్న అవరోధాలను కోవిడ్–19 బహిర్గత పరిచింది. ఆవిష్కరణల ఆవశ్యకతను తెలుపడంతో పాటుగా సుస్ధిరత అనేది ఈ రంగ అభివృద్ధికి కీలకమని తెలిపింది. మన కార్యకలాపాలన్నింటికీ డిజిటల్ వేదికలను మనం స్వీకరిస్తోన్న వేళ, తరువాత దశాబ్దం కోసం ఈ మార్పును స్థిరంగా కొనసాగించడం కీలకం. డిజిటల్ జోక్యాలు మనకు సృజనాత్మకంగా సహాయపడే సామర్ధ్యం కలిగి ఉండటంతో పాటుగా మార్కెట్ వాటాను సైతం వృద్ధి చేస్తాయి. ఆవిష్కరణ అనేది కేవలం మాలిక్యులర్ అభివృద్ధి పరంగా మాత్రమే కాదు తయారీ, శిక్షణ, డాటా విశ్లేషణ, నిల్వ పరంగా ఉండటం అత్యంత ఆవశ్యకం. డిజిటల్ పరివర్తన పరంగా సుస్థిరమైన విధానం ఈ పరిశ్రమను కీలకమైన వృద్ధి ప్రదాతగా అంతర్జాతీయంగా నిలుపనుంది’’ అని అన్నారు. దిలీప్ సంఘవి, ఎండీ, సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఫార్మాస్యూటికల్ మూలస్థంభాలైనటువంటి పరిశోధన, తయారీ, విక్రయం మరియు మార్కెటింగ్ పై సాంకేతిక ప్రభావం చూపుతుంది. ఇది ప్రతి వ్యాపార విభాగంలోనూ పనితీరు నాణ్యత మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఈ మార్పులు ఉత్పత్తి అభివృద్ధిలో వేగాన్ని మరింత పెంచడంతో పాటుగా మార్కెట్లో వాటి లభ్యతను సైతం వేగం చేస్తుంది. అదే రీతిలో ఖర్చులను తగ్గించి, రోగులకు ప్రయోజనం కలిగించనుంది. అంతేకాదు, ఈ మహమ్మారి టెలి–కన్సల్టేషన్పై దృష్టి కేంద్రీకరించేలా చేసింది. ఇది రోగులకు చికిత్స పరంగా అతి ముఖ్యమైన అంశంగానూ నిలిచింది. ఈ టెలి కన్సల్టేషన్ అనేది నాణ్యమైన చికిత్సను రోగులు పొందడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించనుందని, మరీ ముఖ్యంగా చిన్న నగరాల్లో దీని ప్రాముఖ్యత పెరుగుతుందని విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు. నీలేష్ గుప్తా, ఎండీ, లుపిన్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఔషద తయారీ మరియు నాణ్యత పరీక్షలనేవి స్వాభావికంగా అత్యంత క్లిష్టమైనవి. బహుళ ప్రక్రియలు దీనిలో భాగంగా ఉంటాయి. ఇది గత 20 సంవత్సరాలుగా ఎలాంటి మార్పులకూ లోను కాకుండా ఉంది. ఈ ప్రక్రియలు రాబోయే 20 సంవత్సరాల పాటు కొనసాగించలేము. అందువల్ల సంపూర్ణమైన సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణలు కావాల్సి ఉంది. ఔషద పరిశ్రమ ఇటీవలనే తమ డిజిటల్ ప్రయాణం ఆరంభించింది. స్మార్ట్ సొల్యూషన్స్ను అమలు చేయడం ద్వారా తయారీప్రాంగణాలు మరింత స్మార్ట్గా కార్యకలాపాలు నిర్వహించగలవని నేను నమ్ముతున్నాను. ఇతర రంగాల నుంచి ఔషద రంగం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఔషద తయారీ మరియు పరీక్షల నిర్వహణ తీరును పునర్నిర్వచించడంలో సహాయపడుతుంది’’ అని అన్నారు. సుదర్శన్ జైన్, సెక్రటరీ జనరల్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ మాట్లాడుతూ ‘‘ రోగి కేంద్రీకృత విధానం దిశగా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ చేస్తోన్న ప్రయత్నాలను మరోమారు కోవిడ్–19 పునరుద్ఘాటించింది. ఈ సంవత్సరం నాణ్యత నిర్వహణ పరంగా ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులపై సమగ్ర చర్చను సులభతరం చేసేందుకు పరిశ్రమలో ముఖ్యమైన గొంతుకల నేతృత్వంలో ఓ వేదికను 6వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఫోరమ్ అందించింది...’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో 40మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు 15 అనుసంధానిత సదస్సులలో పాల్గొనడంతో పాటుగా నాణ్యత నిర్వహణ నూతన దిశలో రోగి కేంద్రీృకత గురించి మాట్లాడారు. ఔషద పరిశ్రమలో నాణ్యత నిర్వహణను నిర్వచించే పలు అంశాలను గురించి ఈ ఫోరమ్లో చర్చించడంతో పాటుగా తయారీదారులు, నియంత్రణ సంస్థలను ఒకే దరికి తీసుకువచ్చి అర్థవంతమైన, చర్య తీసుకోతగిన ఫలితాలను అందించేలా చర్చలను చేశారు. అత్యున్నత నాణ్యత కలిగిన ఔషద ఉత్పత్తులు అయినటువంటి డిజిటైజేషన్, కృత్రిమ మేథస్సు, పరిశ్రమ మరియు విద్య సహకారం, రెగ్యులేటరీ ఎఫైర్స్ వంటి వాటిని అందించడంలో అత్యంత కీలకమైన విభాగాలపై సైతం ప్యానలిస్ట్లు చర్చించారు.
‘‘మహమ్మారి వేళ, అత్యున్నత నాణ్యత కలిగిన ఔషదాలను స్థిరంగా అందుబాటులో ఉండేలా చేయాల్సిన ఆవశ్యకత పరిశ్రమకు ఉంది. భారతీయ ఔషద పరిశ్రమ ఈ విషయంలో అంచనాలను మించిన సామర్థ్యం ప్రదర్శించిందని గర్వంగా చెప్పగలం మరియు నాణ్యమైన ఔషదాలను అందించడంలో ఆధారపడతగిన భాగస్వామిగా మా గుర్తింపును మరింతగా నిలుపుకున్నాం’’ అని శ్రీ జైన్ జోడించారు. ఈ కార్యక్రమం ‘ఔషద పరిశ్రమపై కోవిడ్–19 ప్రభావం’ అనే అంశంపై ప్రత్యేకమైన ప్యానెల్ చర్చతో ముగించారు. కాడిలా హెల్త్కేర్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ఫార్మా వంటి అగ్రశ్రేణి భారతీయ ఔషద సంస్ధల సీ–సూట్ను ఏకతాటిపైకి ఇది తీసుకువచ్చింది.