Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వినియోగదారులు 5జి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఒప్పో సమీక్షలో తేలినట్టు ఆ సంస్థ పేర్కొంది. ఇటీవల ఒప్పో రెనో 5 ప్రో ఆవిష్కరణ తర్వాత వినియోగ దారుల అనుభవాలను తెలుసుకునేందుకు ఓ సమీక్ష చేపట్టినట్టు పేర్కొంది. ఇందులో 1800 మంది పైగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారని తెలిపింది. తమ రెనో 5 ప్రో కొనుగోలు చేసుకునేందుకు 5దీ పైన ఆసక్తినే ప్రధాన కారణమనీ, అదే విధంగా ఫాస్ట్ చార్జింగ్ కూడా అని ఎక్కువ మంది తెలిపారని పేర్కొంది.