Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది నుంచి స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్
న్యూఢిల్లీ : ప్రముఖ విద్యుత్ వాహనాల కంపెనీ టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ భారత్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు. మాస్క్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ఎక్స్ సంస్థకు అనుబంధ సంస్థ అయినా స్టార్ లింక్ ఈ సేవలను 2022 ఏడాది నుంచి దేశంలో అందుబాటులోకి తేనుంది. దీనికి సంబంధించి రూ.7000 (99 డాలర్లు)తో ప్రీబుకింగ్ ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. హైక్వాలిటీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రపంచంలో ఇంటర్నెట్ సదుపాయం లేని మారు మూల ప్రాంతాలకు అందించాలన్న లక్ష్యంతో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు 150 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తుండగా.. రానున్న రోజుల్లో దీన్ని 1జీ బీపీఎస్కు పెంచనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. అయితే నెలసరి అద్దె ఎంతా అనేది స్పష్టతనివ్వలేదు.