Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లోనూ నివాసాల విక్రయం
నవతెలంగాణ- వాణిజ్యప్రతినిధి
ప్రముఖ నిర్మాణ, సిమెంట్ రంగ కంపెనీ మై హోమ్ గ్రూప్ భారీ వృద్థిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థ 35 ఏండ్ల వేడుకలకు ప్రతీకగా ఈ ఏడాది 35 మిలియన్ల (3.5 కోట్ల) చదరపు అడుగుల విస్తీర్ణ నిర్మాణాలను చేపట్టి నూతన మైలురాయిని చేరుకోవాలని నిర్దేశించుకుందని మై హోమ్ గ్రూప్ హోల్ టైం డైరెక్టర్ రాము రావు, ఎండీ శ్యామ్ రావ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే 2.7 కోట్ల చ.అ ప్రాంగణాన్ని డెలివరీ చేయగా.. మరో 80 లక్షల చ.అ స్థలం నిర్మాణపరంగా పలు దశల్లో ఉన్నదనీ.. దీన్ని ఈ సంవత్సరాంతానికి కొనుగోలుదారులకు అందించనున్నామన్నారు. కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో కొనుగోలుదారులకు దగ్గర కావడానికి వీలుగా ఆన్లైన్లో గృహ అమ్మకాలకు వీలుగా 3డి హోమ్ వర్చువల్ సొల్యూషన్స్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు 10వేల కుటుంబాలకు నాణ్యమైన గృహాలను నిర్మించి ఇచ్చామన్నారు. ఆన్లైన్లోనే ప్రజలకు తమకు కావాల్సిన నివాసాన్ని బుక్ చేసుకోవడం, చెల్లింపులు చేసేలా తమ సైట్ను డిజైన్ చేశామన్నారు. ఆ సంస్థ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ ఎ శ్రీనివాస రావు మాట్లాడుతూ కరోనా కాలంలోనూ రూ.2000 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్లును చేపట్టామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టగా.. రూ.3200 కోట్ల రెవెన్యూ నమోదు చేశామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామన్నారు. తెల్లాపూర్, కోకాపేటలో రెండు కొత్త ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ హోల్టైమ్ డైరెక్టర్ వినోద్ రావు జూపల్లి, డైరెక్టర్ మార్కెటింగ్ రాజితా రావు జూపల్లి, ప్రాజెక్ట్స్ సీనియర్ డైరెక్టర్ ఎంకెఆర్ సాయి తదితరులు పాల్గొన్నారు.