Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రప్రదేశ్లోని బొల్లెద్దుపాలెం గ్రామ మహిళ అల్లి దేవుడమ్మ విజయగాథ
ప్రపంచ జనాభాలో సగం మందికి వరి అన్నమే ప్రధానమైన ఆహారం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వరి సాగులో 90% ఆసియా ఖండంలోనే జరుగుతోంది. భారతదేశంలో మొత్తం బియ్యం వినియోగం 102 మిలియన్ టన్నులని అంచనా. సుడి దోమ, తెల్ల వీపు దోమ (ప్లాంట్హాపర్ల) దాడులు భారతదేశంలో బియ్యం దిగుబడిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది. సరైన సమయంలో, సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ధాన్యం దిగుబడిలో 10 నుండి 70 శాతం వరకు నష్టాలు చవిచూడవలసి వస్తుంది.
వరి సాగులో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో వరిసాగు వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం సంప్రదాయకంగా ఎక్కువ కాగా, మహిళా కార్మికుల సేవలను గణనీయంగా వినియోగించుకుంటున్నారు మరియు వరి సాగులో తీవ్రమైన నీటిపారుదల వ్యవస్థ ఉన్న చోట ఎక్కువ మంది మహిళా కార్మికుల సేవలు అవసరం అవుతున్నాయి.
భారతదేశంలో వరి సాగులో మహిళలు పోషిస్తున్న పాత్రను ఆమోదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం మరియు వ్యవసాయ సంఘాలు సాగులో ఉన్న మహిళలకు పంట పండించేందుకు మరియు దానితో ముడిపడి ఉన్న ఆర్థిక అంశాల గురించి మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. అలా శిక్షణ ఇస్తున్న ఒక సంస్థకార్టెవా అగ్రిసైన్స్ కాగా, ఈ గ్లోబల్ అగ్రికల్చర్ కంపెనీ భారతదేశంలోని మహిళా రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు మరియు వారు సొంత కాళ్లపై నిలిచేందుకు సహాయం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన అల్లి దేవుడమ్మ తన భర్త, కుమార్తె, అల్లుడు మరియు తమ 2 (ఇద్దరు)మనవళ్లతో కలిసి ఉంటున్నారు. వారు తమ జీవనోపాధికి 30ఎకరాల పొలంలో వరిసాగు చేస్తున్నారు. సాగు నుంచి, కుటుంబ నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాల్లో ఆమే కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఆమె భర్త మరియు అల్లుడు వ్యవసాయ కార్యకలాపాల్లో ఆమెకు మద్ధతు ఇస్తున్నారు.కొన్నేళ్లుగా, ఆమె మరియు గ్రామంలోని ఇతర సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వరి పంటను ఆశించే దోమలు కాగా, దానితో వారంతా పంట దిగుబడి నష్టపోతున్నారు. ప్రతి సీజన్లో 4-5 సార్లు ఔషధాలను పిచికారీ చేసినా పరిస్థితిల్లో మార్పురాలేదు. అనంతరం ఆమె సన్నబియ్యం సాగు నుంచి లావు రకం బియ్యం సాగుకు మారడం ద్వారా పంటను ఆశించే దోమల దాడి నియంత్రణలోకి వచ్చి, నష్టాలు తగ్గుతాయని భావించినా, దానితో ఆమెకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. సన్నకారు మహిళా రైతులకు మద్ధతు ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా, వరి మొక్కను బ్రౌన్ ప్లాంట్ హాపర్ (సుడిదోమ/గోధుమ రంగు దోమ) మరియు వైట్-బ్యాక్డ్ ప్లాంట్ హాపర్ల (తెల్లవీపు దోమ) నుంచి రక్షణ కోసం రూపొందించిన హాపర్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కార్టెవా పెక్సలోన్ వినియోగించాలని దేవుడమ్మకు సిఫార్సు చేశారు. ఈ ఉత్పత్తిని కొన్ని కాలం వాడడంతో దోమల నియంత్రణకు మూడు వారాల పాటు గరిష్టంగా రెండు సార్లు పిచికారీలో ఒకటి మాత్రమే సరిపోతుందని ఆమె గుర్తించారు. దీనితో, పెక్సలోన్ ఆమె జీవితానికి రక్షకురాలిగా మారడంతో అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసే అవకాశమే కలుగలేదు. ఆమె గడించిన లాభాలతో మరో 7 ఎకరాల భూమికొనుగోలు చేసందుకు పెట్టుబడి పెట్టింది.
మొత్తం మీద, వరి సాగులో మహిళలు పోషిస్తున్న కీలకమైన పాత్రకు అనుగుణంగా, భూమి మరియు యాజమాన్య హక్కుల ద్వారా వారిని బలోపేతం చేయడం చాలా అవసరం మరియు వారి సేద్యం మరియు జీవనోపాధికి తోడ్పడే ఉత్తమమైన మరియు అత్యంత వినూత్నమైన మరియు సుస్థిరమైన పరిష్కరణలను అలవర్చుకునేలా చేయడం తదితరాలతో పర్యావరణంపైనా సానుకూలమైన ప్రభావాన్ని చూపించవచ్చు. దీని ద్వారా సాగు ఉత్పత్తిని వృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది.