Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ అంతర్జాతీయ సరుకు రవాణ, కొరియర్ సేవల సంస్థ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 2022 జనవరి 1వ తేది నుంచి దేశంలో సగటు రవాణ చార్జీలను 6.9 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ద్రవ్యోల్బణం, మారకం ధరల్లో మార్పులు, నిర్వహణ వ్యయాలు పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. స్థానిక పరిస్థితులపై ఆధారపడి, ధరల సర్దుబాట్లు దేశం నుంచి మరో దేశానికి మారుతూ ఉంటాయని తెలిపింది.