Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్వ్యాగన్ తన టైగన్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని 2020లో ఆటో ఎక్స్పోలో తొలి సారిగా ప్రదర్శించింది. దీని ఎక్స్షోరూం ధరను రూ 10.5 లక్షలుగా నిర్ణయించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో వచ్చే పండుగ సీజన్లో అమ్మకాలు పెరుగుతాయని ఆ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిజన్ బ్రేక్స్, రియర్వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ డిఫ్లేషన్ హెచ్చరిక వంటి ఫీచర్లను కలిగి ఉంది.