Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కియా ఇండియా, దేశంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న కారు తయారీదారు, తమ 3 వరుసల విశ్రాంతి వాహనం, ద కియా కారెన్స్ కోసం ప్రీ-లాంచ్ బుక్కింగ్స్ ఆరంభిస్తున్నట్లుగా 14 జనవరి, 2022న ఆరంభిస్తున్నట్లుగా నేడు ప్రకటించింది. కస్టమర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న కియా కారెన్స్ ని కియా ఇండియా వారి అధికారిక వెబ్ సైట్ ద్వారా మరియు దేశవ్యాప్తంగా ఉన్న అథీకృత డీలర్ షిప్ నెట్ వర్క్ ద్వారా కూడా ఐఎన్ఆర్ 25,000 బుక్కింగ్ మొత్తంతో తమ ఇంటి నుండే సౌకర్యవంతంగా బుక్ చేయవచ్చు. సోనెట్, సెల్టోస్ వలే, కారెన్స్ కూడా మరొక ‘మేడ్-ఇన్-ఇండియా-ఫర్-ద-వరల్డ్’ ఉత్పత్తి , తమ శ్రేణిలో మొదటిసారిగా ఇలాంటి ఫీచర్స్ కలిగిన ప్రత్యేకతని పొందింది. భారతదేశపు మార్కెట్ తో పాటు, కియా కారెన్స్ కుడి, ఎడమ చేయి డ్రైవ్ మార్కెట్స్ సహా 90 దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
కస్టమర్స్ 14, జనవరి 22 అర్థరాత్రి నుండి కియా కారెన్స్ ని ఈ లింక్ -https://www.kia.com/in/buy/pre-booking.htmlని ఉపయోగించి ప్రీ-బుక్కింగ్ ని ఆరంభించవచ్చు.
కియా కారెన్స్
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16, 2021న ప్రారంభించబడిన, ద కియా కారెన్స్ 10 దృఢమైన హై-సెక్యూర్ భద్రతా ప్యాకేజీతో, 6 ఎయిర్ బ్యాగ్స్ సహా అన్ని అయిదు ట్రిమ్స్ లో -ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ లలో స్టాండర్డ్ గా లభిస్తోంది. 66 కనక్ట్ చేయబడిన ఫీచర్లతో కియా కనక్ట్ ద్వారా కూడా వాహనం ఆధునిక కనక్టివిటీని తమ శ్రేణిలో పొడవైన వీల్ బేస్ తో పాటు పవర్ ట్రైన్స్, ట్రాన్స్ మిషన్ ఐచ్ఛికాలు యొక్క ఎంపికలతో, ఆధునిక భారతదేశపు కుటుంబానికి పరిపూర్ణమైన ఎంపికగా నిలిచింది. ఇంకా, వాహనానికి ఆధునిక కియా కనక్ట్ తో 26.03 సెం.మీ ( 10.25") హెచ్ డీ టచ్ స్క్రీన్ నేవిగేషన్, 8 స్పీకర్స్ తో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం , వైరస్, బ్యాక్టీరియా రక్షణతో స్మార్ట్ ప్యూర్ ప్యూరిఫైర్ , గాలి , వెలుతురు ప్రసరించే ఫ్రంట్ సీట్స్, 2వ వరుస సీట్ ' వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబల్ ', స్కై లైట్ సన్ రూఫ్ వంటి తమ శ్రేణిలో ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నాయి. కియా కారెన్స్ మూడు పవర్ ట్రైన్ ఐచ్ఛికాలలో లభిస్తోంది -స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీమ్ 1.4 టీ- జీడీఐ పెట్రోల్ , మరియు 1.5 సీఆర్ డీఐ వీజీటీ డీజిల్ లు మూడు ట్రాన్స్ మిషన్ ఐచ్ఛికాలతో కలిసి ఉంది- 6 ఎంటీ, 7 డీసీటీ మరియు 6ఏటీ.