Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న కార్ల తయారీ సంస్థ అయిన కియా ఇండియా, మొట్టమొదటి రోజునే 7738 బుకింగ్లతో కియా కారెన్స్, భారతీయ కస్టమర్ల నుండి అత్యద్భుతమైన ప్రతిస్పందనను పొందినదని వెల్లడించింది. కియా ఇండియా ఆధికారిక వెబ్ సైట్ www.kia.com/in మరియు కియా ఇండియా వారి అధీకృత డీలర్షిప్ల ద్వారా రూ. 25,000 ప్రారంభ బుకింగ్ సొమ్మును చెల్లించి, కొనుగోలు చేయదలుచుకున్న కస్టమర్లు ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ 14 జనవరి 2022న ప్రారంభించింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాయ్-జిన్ పార్క్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO, కియా ఇండియా, ఇలా అన్నారు, “ప్రీ-బుకింగ్లను ప్రారంభించిన తొలి 24 గంటలలోనే కస్టమర్ల నుండి కియా కారెన్స్కు లభించిన అద్భుతమైన ప్రతిస్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. భారతదేశంలో మా ఉత్పత్తులకు లభించిన అతి ఎక్కువ మొదటి రోజు బుకింగ్ ఇది. కారెన్స్తో మేము బహుళ ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ అవకాశాలను, దానితోపాటు ప్రామాణికమైన (స్టాండర్డ్) రోబస్ట్ 10 హై సేఫ్టీ ప్యాకేజ్ మరియు ఈ శ్రేణిలో మొట్టమొదటిసారిగా పలు ఫీచర్లను అందిస్తున్నాము. తద్వారా, అధునాతనమైన, సురక్షితమైన ఫ్యామిలీ వాహనం కావాలనుకునే వారికి కావలసిన అన్ని అవసరాలకు ఇది అనుగుణంగా ఉండేట్లు శ్రద్ధ వహించటమైనది. కియా బ్రాండ్ పట్ల మా కస్టమర్లు చూపిన నమ్మకం మాకు ఆనందాన్ని కలిగించింది. దేశంలో మేము అందిస్తున్న తాజా ఉత్పత్తి పట్ల పెరుగుతున్న ఆదరణకు కూడా ఈ ప్రతిస్పందన గీటురాయిగా నిలిచింది.” అని అన్నారు.