Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ ముగింపు నాటికి అవకాశం
న్యూఢిల్లీ : భారత్లో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి భారతీ ఎయిర్టెల్ కీలక అడుగు వేసింది. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ వన్ వెబ్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ హ్యూస్తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ ఆరు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం మీద ఆయా సంస్థలు సంయుక్తంగా సంతకాలు చేశాయి. వ్యూస్ కమ్యూనికేషన్స్ హైదరాబాద్కు చెందిన సంస్థ కావడం విశేషం. దీంతో భారత్లో అతిపెద్ద శాటిలైజ్ సర్వీస్ ఆపరేటర్గా హ్యూస్ కమ్యూనికేషన్స్ నిలువనుంది. ప్రస్తుతం ఈ సంస్థ బ్యాంకింగ్, ఏరోనాటికల్, మేరీటైమ్ మొబిలిటీ, విద్య, టెలికాం వంటి రంగాల్లో సేవలందిస్తోంది. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వల్ల దేశంలోని ప్రతీ మారుమూల ప్రాంతానికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల 2022 చివరి నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వన్ వెబ్ సిఒఒ నీల్ మాస్టర్సన్ పేర్కొన్నారు.