Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 15 నుంచి 18 సంవత్సరాల నడుమ వయసు చిన్నారులకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో, ఎక్స్లెన్సియా ఇన్ఫినిటమ్ తమ మొదటి వ్యాక్సినేషన్ డ్రైవ్ను 07జనవరి 2022 న ప్రారంభించింది. ఈ డ్రైవ్తో ఎక్స్లెన్సియా జూనియర్ కళాశాలల, ఈసీఐఎల్ అలాగే సుచిత్ర శాఖలలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ను కీసరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం భాగస్వామ్యంతో నిర్వహించారు. ఎక్స్లెన్సియా జూనియర్ కళాశాల, ఈసీఐఎల్కు చెందిన 230 మంది డే స్కాలర్ విద్యార్థులలో 147 మందికి విజయవంతంగా వ్యాక్సిన్ వేశారు. కోవిడ్ మార్గదర్శకాన్నీ అనుసరించడంతో పాటుగా తగిన భద్రతా చర్యలను తీసుకుని విజయవంతంగా ఈ డ్రైవ్ను ఇనిస్టిట్యూషన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎక్స్లెన్సియా ఇనిస్టిట్యూషన్స్ ఫౌండర్, డైరెక్టర్ వెంకట్ మురికి మాట్లాడుతూ 'మా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ టీకా కార్యక్రమం నిర్వహించాము. కోవిడ్ కారణంగా ఇప్పటికే సాధారణ విద్యా జీవితం ప్రభావితమైంది. భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేయడంతో పాటుగా వ్యాక్సిన్లను సురక్షిత వాతావరణంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచడం మా ప్రధాన లక్ష్యం. తద్వారా సంప్రదాయ తరగతులు తిరిగి తీసుకురావడం, కాలేజీలు, పాఠశాలలు తిరిగి పనిచేసేలా చేయడం. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేనేజ్మెంట్ తమ వంతు తోడ్పాటునందిస్తుంది` అని అన్నారు.