Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన విలువ
- వెనుకబడ్డ బిట్ కాయిన్
న్యూఢిల్లీ: అంతర్జాతీ యంగా క్రిప్టో మార్కెట్ క్రమంగా పడి పోతోంది. దీంతో పసిడి- బిట్కాయిన్ వాటిలో దేనిపై పెట్టుబడులు పెట్టాలనే చర్చ మళ్లీ మొదల య్యింది. గత ఏడాదిన్నర కాలంలో బిట్ కాయిన్ విలువ అమాంతం పడిపోవడంతొ.. బంగారం మాత్రం స్థిరంగా రాణించగలిగింది. నాలుగున్నర ఏళ్ల క్రితం అంటే 2017 డిసెంబర్ 17న బిట్ కాయిన్ విలువ 20,089 డాలర్లుగా ఉండగా.. ఏడాది క్రితం ఏకంగా 69వేల డాలర్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఆ తర్వాత కాలంలో క్రమంగా పడపోతూ ప్రస్తుతం 20వేల డాలర్ల దిగువన.. 19,848 డాలర్లకు దిగజారింది. నాలుగున్నరేండ్ల కిందట బిట్ కాయిన్ విలువతో పోల్చితే ఇప్పుడు 2 శాతం మాత్రమే విలువ పెరిగింది. ఇదే సమయంలో పసిడిపై పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదయ్యింది. అంటే ఈ కాలంలో బంగారం ధర 40 శాతం పెరిగినట్లయ్యింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,500గా ఉంది. 2017 డిసెంబర్లో ఈ ధర రూ.30,000గా నమోదయ్యింది. బిట్ కాయిన్తో పోల్చితే బంగారమే విజేతగా నిలిచిందని స్పష్టమవుతుంది.