Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నంలో ఆరోగ్య సదుపాయాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతో వేదాంత యొక్క వైజాగ్ జనరల్ కార్గో బెర్త్ (వీజీసీబీ) నగరంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కు వైద్య పరికరాలను అందించడం ద్వారా మద్దతునందించింది. ఈ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా కార్డియోలైన్ హోల్టర్ మానిటర్ను హాస్పిటల్లోని కార్డియాలజీ డిపార్ట్మెంట్కు విరాళంగా ఈ కంపెనీ అందించింది.
ఈ మెషీన్ ను హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ పీ మైథిలికి వీజీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సీ సతీష్కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మల్లాది శ్రీనివాసరావు; స్థానిక ఇన్ఫ్లూయెన్సర్ డాక్టర్ ఫిరీన్ రెహ్మాన్ కూడా పాల్గొన్నారు.
ఈ వైద్య పరికరాలు రోగులతో పాటుగా వైద్య విద్యార్థులకు సైతం ప్రయోజనం కలిగించనున్నాయని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఈ పరికరాలనందించిన వీజీసీబీకి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా వేదాంత –ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్ సౌవిక్ మజుందార్ మాట్లాడుతూ ‘‘వేదాంత వద్ద తామెప్పుడూ కూడా సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడే సీఎస్ఆర్ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాము. సమాజాభివృద్ధిలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కూడా కీలకమని నమ్ముతుంటాం. ఈ వైద్య మౌలికవసతులు వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలిగించుంద’’ని అన్నారు.
కింగ్ జార్జ్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ మల్లాది శ్రీనివాస రావు మాట్లాడుతూ ‘‘అత్యంత విలువైన హోల్టర్ రికార్డర్ మరియు ఎనలైజర్ను కార్డియాలజీ డిపార్ట్మెంట్కు అందించిన వీజీసీబీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాధారణంగా ఈ పరీక్ష చేయడానికి బయట 2–3వేల రూపాయల ఖర్చు అవుతుంది. నిరుపేదలకు ఇది పూర్తి ప్రయోజనం కలిగించనుంది. అలాగే పీజీ విద్యార్థులకు సైతం ఉపయుక్తంగా ఉంటుంది’’అని అన్నారు.
వేదాంత– వీజీసీబీ సీఈఓ సీ సతీష్ కుమార్ మాట్లాడతూ ‘‘మా నిర్మాణాత్మక సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా వైజాగ్ చుట్టు పక్కల ప్రాంతాలలో సమాజాలపై సానుకూల ప్రభావం తీసుకురావాలనేది మా లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపడటంతో పాటుగా అవసరార్ధులైన రోగులకు సహాయపడగలవని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.