Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టెస్లా అధినేత ఎలన్ మాస్క్కు ట్విట్టర్ను విక్రయించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడంతో ఈ డీల్లో మరో అడుగు ముందుకు పడినట్లయ్యింది. ఇకపై దీనికి వాటాదారుల ఆమోదం కావాల్సి ఉంది. నష్ట పరిహారానికి అంగీకరిస్తూనే విలీన ఒప్పందానికి వాటాదారులు ఓటు వేయాలని ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫారసు చేసినట్టు సమాచారం. నకిలీ ఖాతాల సమాచారం ఇవ్వకపోతే ఈ ఒప్పందం రద్దు కానుందని మస్క్ మధ్యలో మెలిక పెట్టినప్పటికీ.. తిరిగి గతవారం ట్విట్టర్ను కొనుగోలు చేయనున్నట్టు మస్క్ తన ఉద్యోగులతో పేర్కొన్నారు.