Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నిటి అయోగ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. వచ్చే రెండేండ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని శుక్రవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న అమితాబ్ కాంత్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. 1981 ఉత్తర ప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కు చెందిన అయ్యర్ 2009లో ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా.. ఐక్యరాజ్య సమితిలో సీనియర్ గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య నిపుణుడిగా పని చేశారు. 2016లో భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కేంద్రం తిరిగి తాగు నీరు, శానిటైజేషన్ శాఖ సెక్రెటరీ హోదాను కల్పించింది. 2020 జులైలో వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ పదవీకి రాజీనామా చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్లోనూ కీలక బాధ్యతలను పోషించారు.